సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!

- June 13, 2025 , by Maagulf
సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!

మనామా: కొద్ది రోజుల క్రితం సార్‌లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అబ్దుల్ అహ్మద్ మరణించాడు. ఈ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు అప్పటికే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం విహారయాత్రకు వెళుతుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రి,  తల్లి మరణించగా, వారి ముగ్గురు పిల్లలు - అబ్దుల్ అజీజ్, అతని సోదరి అయా,  అన్నయ్య యూసిఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా, ప్రమాదం జరిగిన సమయంలో అబ్దుల్ అజీజ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, అతని పరిస్థితి మరింత దిగజారిందని,  అతను శుక్రవారం తెల్లవారుజామున మరణించాడని పేర్కొన్నారు. గాయపడిన అతని సోదరి అయా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారి అన్నయ్య యూసిఫ్ చికిత్స కొనసాగుతుందని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.   ఈ విషాదం స్థానిక కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని అనేకమంది ఆస్పత్రి వద్ద ప్రార్థించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com