సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- June 13, 2025
మనామా: కొద్ది రోజుల క్రితం సార్లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అబ్దుల్ అహ్మద్ మరణించాడు. ఈ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు అప్పటికే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం విహారయాత్రకు వెళుతుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రి, తల్లి మరణించగా, వారి ముగ్గురు పిల్లలు - అబ్దుల్ అజీజ్, అతని సోదరి అయా, అన్నయ్య యూసిఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో అబ్దుల్ అజీజ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, అతని పరిస్థితి మరింత దిగజారిందని, అతను శుక్రవారం తెల్లవారుజామున మరణించాడని పేర్కొన్నారు. గాయపడిన అతని సోదరి అయా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారి అన్నయ్య యూసిఫ్ చికిత్స కొనసాగుతుందని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ విషాదం స్థానిక కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని అనేకమంది ఆస్పత్రి వద్ద ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'