సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- June 13, 2025
మనామా: కొద్ది రోజుల క్రితం సార్లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అబ్దుల్ అహ్మద్ మరణించాడు. ఈ ప్రమాదంలో అతని తల్లిదండ్రులు అప్పటికే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబం విహారయాత్రకు వెళుతుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బాలుడి తండ్రి, తల్లి మరణించగా, వారి ముగ్గురు పిల్లలు - అబ్దుల్ అజీజ్, అతని సోదరి అయా, అన్నయ్య యూసిఫ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో అబ్దుల్ అజీజ్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. వైద్య బృందం అవిశ్రాంత ప్రయత్నాలు చేసినప్పటికీ, అతని పరిస్థితి మరింత దిగజారిందని, అతను శుక్రవారం తెల్లవారుజామున మరణించాడని పేర్కొన్నారు. గాయపడిన అతని సోదరి అయా కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. వారి అన్నయ్య యూసిఫ్ చికిత్స కొనసాగుతుందని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఈ విషాదం స్థానిక కమ్యూనిటీని తీవ్రంగా కలచివేసింది. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని అనేకమంది ఆస్పత్రి వద్ద ప్రార్థించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!