ఆర్సీబీ విజయోత్సవంలో తొక్కిసలాట…త్రిసభ్య కమిటీ ఏర్పాటు!
- June 15, 2025
ముంబై: ఆర్సీబీ విజయం సందర్భంగా బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై బీసీసీఐ తీవ్రంగా స్పందించింది.భవిష్యత్లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు మరొకసారి చోటు చేసుకోకుండా ఉండేందుకు, ఐపీఎల్ కార్యక్రమాల సమయంలో భద్రతా చర్యలను మెరుగుపరిచేందుకు బోర్డు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో, అవసరమైన భద్రతా మార్గదర్శకాలను రూపొందించేందుకు బీసీసీఐ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ప్రభ్ తేజ్ సింగ్ భాటియా సభ్యులుగా ఉన్నారు.
ఈ ఘటనపై బోర్డు ఒక ప్రకటన విడుదల చేస్తూ, “బెంగళూరులో జరిగిన తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం.అందుకే కమిటీ ఏర్పాటుచేశాం.త్వరలోనే కమిటీ తగిన భద్రతా మార్గదర్శకాలను విడుదల చేస్తుంది” అని పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..