సార్ క్రాష్ డ్రైవర్ పై జూన్ 23న విచారణ..!!

- June 16, 2025 , by Maagulf
సార్ క్రాష్ డ్రైవర్ పై జూన్ 23న విచారణ..!!

మనామా: సార్‌లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై జూన్ 23న విచారణ జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఓ తండ్రి, తల్లితోపాటు వారి బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. అతను చట్టపరమైన పరిమితికి మించి వేగంతో కారును నడుపుతున్నాడని,  ప్రాథమిక ట్రాఫిక్ భద్రతా నియమాలను పూర్తిగా ఉల్లంఘించాడని వెల్లడించారు. 

మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అకస్మాత్తుగా డివైడర్ దాటి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బాధితుల కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తండ్రి, తల్లి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.  వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.  రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహారించి, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com