సార్ క్రాష్ డ్రైవర్ పై జూన్ 23న విచారణ..!!
- June 16, 2025
మనామా: సార్లో జరిగిన విషాదకరమైన కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై జూన్ 23న విచారణ జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఓ తండ్రి, తల్లితోపాటు వారి బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ మాదకద్రవ్యాలు, మద్యం సేవించి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. అతను చట్టపరమైన పరిమితికి మించి వేగంతో కారును నడుపుతున్నాడని, ప్రాథమిక ట్రాఫిక్ భద్రతా నియమాలను పూర్తిగా ఉల్లంఘించాడని వెల్లడించారు.
మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అకస్మాత్తుగా డివైడర్ దాటి దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న బాధితుల కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తండ్రి, తల్లి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహారించి, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారికి కఠినమైన శిక్షలు విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









