హజ్ యాత్రికుల విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
- June 16, 2025
ఉత్తర్ ప్రదేశ్: హజ్ యాత్రికులతో లఖ్నవూ ఎయిర్పోర్టుకు చేరుకున్న సౌదీ అరేబియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. 250 మంది హజ్ యాత్రికులతో జెడ్డా నుంచి బయల్దేరిన సౌదీ ఎయిర్లైన్స్ విమానం ఆదివారం ఉదయం లఖ్నవూలోని అమౌసి విమానాశ్రయంలో దిగింది. ఆ తర్వాత.. టాక్సీ మార్గంలో వెళుతుండగా విమానం ఎడమ టైర్ నుంచి నిప్పురవ్వలు, దట్టమైన పొగలు వచ్చినట్లు విమానాశ్రయం అధికారులు సోమవారం వెల్లడించారు. వెంటనే, అప్రమత్తమైన పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించడంతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు ఆర్పారని తెలిపారు. అనంతరం ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఎడమ చక్రం నుంచి మంటలు
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్కు చెందిన విమానం SV 3112 శనివారం రాత్రి 11:30 గంటలకు సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి 250 మంది హజ్ యాత్రికులతో బయలుదేరింది. ఆదివారం ఉదయం 6:30 గంటలకు లఖ్నవూలోని అమౌసి విమానాశ్రయానికి చేరుకుంది. రన్వేపై దిగిన తర్వాత, విమానం టాక్సీవే పైకి వస్తుండగా దాని ఎడమ చక్రం నుంచి మంటలు, పొగ రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం అందించాడు.
అత్యవసర చర్యలు–సిబ్బంది శ్రమ ఫలించింది
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు దాదాపు 20 నిమిషాలు శ్రమించి మంటలను ఆర్పారు. అనంతరం ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు పేర్కొన్నారు. సాంకేతికలోపం కారణంగా విమానం రన్వేపై ల్యాండ్ అవుతున్న సమయంలో ఎడమ చక్రం పనిచేయకపోవడంతో మంటలు వచ్చాయని తెలిపారు.
హజ్ యాత్రికులకు కలిగిన దడ
250 మంది హజ్ యాత్రికులు జెడ్డా నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులంతా ప్రార్థనలు చేసుకుంటూ భయాందోళనలో ఉన్నారు, కానీ సిబ్బంది సత్వర చర్య వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన ద్వారా మరోసారి పైలట్ శాంతస్వభావం, సిబ్బంది అప్రమత్తత, అత్యవసర సేవల సమయోచిత స్పందన వల్ల పెనుప్రమాదం తప్పింది. హజ్ యాత్రికులు సురక్షితంగా బయటపడడం ఆనందదాయకమైన విషయం. అయినప్పటికీ, విమానాల్లో సాంకేతిక లోపాలపై నిరంతర సమీక్ష అవసరం ఉందని విమాన ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- UAEU Concludes Participation in the Arab Media Summit 2026
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







