ధోఫర్ ఖరీఫ్ సీజన్.. ఒమన్ సివిల్ ఏవియేషన్ రెడీ..!!
- June 16, 2025
మస్కట్: రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ఒమన్ సివిల్ ఏవియేషన్ రెడీ అయింది. ధోఫర్ గవర్నరేట్ను సందర్శించే ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తన పూర్తి కార్యాచరణ సంసిద్ధతను ప్రకటించింది. ఈ సీజన్ సందర్భంగా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు భారీగా తరలివస్తారని పేర్కొన్నారు. సీజన్ సమయంలో దేశీయ విమాన ఫ్రీక్వెన్సీలను పెంచుతామన్నారు. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం, సలాలా విమానాశ్రయం రెండింటిలోనూ ప్రయాణికుల కోసం వేగవంతమైన, సురక్షితమైన ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఈ సన్నాహాలు ఒమన్ పర్యాటక ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుందన్నారు. ఈ విషయంలో పౌర విమానయాన రంగం వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఆర్థిక వృద్ధికి దోహదపడే అధునాతన మౌలిక సదుపాయాలను అందిస్తుంది. అదే సమయంలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఒమన్ సుల్తానేట్ స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు. పీక్ సమయాల్లో విమాన కార్యకలాపాలు గణనీయంగా విస్తరిస్తామని తెలిపారు. జూలై 1 నుండి ప్రారంభమయ్యే అత్యంత రద్దీ సమయాల్లో ఒమన్ ఎయిర్ 12 రోజువారీ విమానాలను నడుపుతుందని, అయితే సలాం ఎయిర్ జూలై, ఆగస్టులో దాని కార్యకలాపాలను 8 రోజువారీ విమానాలకు పెంచుతుందని పేర్కొన్నారు. ఇక జూలై 15 నుండి సోహార్, సలాలా మధ్య ఒక రోజువారీ విమానంతో కొత్త ప్రత్యక్ష మార్గాన్ని ప్రవేశపెట్టడం కూడా ఇందులో ఉందన్నారు.
ఈ సీజన్లో ఒమన్ ఎయిర్ 70,000 కంటే ఎక్కువ అదనపు సీట్లను తీసుకురానుంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 16% పెరుగుదలకు సమానం. అయితే సలాం ఎయిర్ తన సామర్థ్యాన్ని 58% విస్తరించింది. 2025 నాటికి దాదాపు 176,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో ధోఫర్ పర్యాటక రంగానికి మద్దతు ఇస్తూనే పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్కు ఈ సర్దుబాట్లు నేరుగా స్పందిస్తాయి.
ఒమన్ పౌరులకు ప్రత్యేక ఛార్జీల స్లాబులు అందుబాటులో ఉన్నాయి. ఒమన్ ఎయిర్ జూలై 1 మరియు సెప్టెంబర్ 15 మధ్య వన్-వే ట్రిప్పులకు OMR32, రౌండ్ ట్రిప్పులకు OMR54 నుండి ప్రారంభమయ్యే ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయనితెలిపారు. అదేవిధంగా, సలాం ఎయిర్ ఒకే ప్రయాణాలకు OMR30 , తిరుగు ప్రయాణాలకు OMR48 నుండి ప్రారంభమయ్యే ఛార్జీలను అందిస్తుంది. మరోవైపు ఒమన్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ మస్కట్, సలాలా విమానాశ్రయాలలో సమగ్ర సన్నాహాలను పూర్తి చేసింది.
సలాహ్ విమానాశ్రయం ప్రయాణీకుల కోసం వినూత్న సేవలను పరిచయం చేస్తోంది. వీటిలో "ట్రావెల్ ఈజీయర్" ద్వారా ప్రయాణికులు బయలుదేరే ముందు 6 నుండి 12 గంటల మధ్య చెక్-ఇన్, బ్యాగేజ్ డ్రాప్ విధానాలను పూర్తి చేయవచ్చు. ఈ సేవ జూలై 15- సెప్టెంబర్ 15 మధ్య ప్రతిరోజూ ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ రద్దీని తగ్గించడానికి , టెర్మినల్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్టు తెలిపింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









