దుబాయ్: ఘనంగా తొలి ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమ్మిట్
- June 16, 2025
దుబాయ్: రాయల్ ఐకాన్ ఈవెంట్స్ LLC మరియు స్పార్క్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన మొదటి ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమ్మిట్ జూన్ 15న దుబాయ్ అల్ జదాఫ్ ప్రాంతంలోని మారియట్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సమ్మిట్ లో యూఏఈ వ్యాప్తంగా ఉన్న తెలుగు వ్యాపారవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాపార అభివృద్ధిపై చర్చలు, నెట్వర్కింగ్ సెషన్లు, అనుభవాల పంచిక వంటి అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ డాక్టర్ బి.లక్ష్మి కాంతం నాయుడు మరియు ప్రముఖ ప్రేరణాత్మక ఉపన్యాసకులు గంపా నాగేశ్వరరావు హాజరై తమ అమూల్యమైన మాటలతో సభను అలరించారు.
ఈ సమ్మిట్ ద్వారా తెలుగు వ్యాపార వేత్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, భవిష్యత్తులో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.ఈ బిజినెస్ సమ్మిట్ ని విజయవంతం చేసిన స్పాన్సర్స్, మీడియా పార్ట్నర్,ప్రొడక్షన్ టీంకు అరుణ్ కుమార్ సుర్నిదా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ బిజినెస్ సమ్మిట్ లో 150 మందికి పైగా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.







తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







