దుబాయ్: ఘనంగా తొలి ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమ్మిట్
- June 16, 2025
దుబాయ్: రాయల్ ఐకాన్ ఈవెంట్స్ LLC మరియు స్పార్క్ మీడియా సంయుక్తంగా నిర్వహించిన మొదటి ఇంటర్నేషనల్ తెలుగు బిజినెస్ సమ్మిట్ జూన్ 15న దుబాయ్ అల్ జదాఫ్ ప్రాంతంలోని మారియట్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సమ్మిట్ లో యూఏఈ వ్యాప్తంగా ఉన్న తెలుగు వ్యాపారవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యాపార అభివృద్ధిపై చర్చలు, నెట్వర్కింగ్ సెషన్లు, అనుభవాల పంచిక వంటి అనేక కార్యక్రమాలు ఈ సందర్భంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి స్పార్క్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సుర్నిదా ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ డాక్టర్ బి.లక్ష్మి కాంతం నాయుడు మరియు ప్రముఖ ప్రేరణాత్మక ఉపన్యాసకులు గంపా నాగేశ్వరరావు హాజరై తమ అమూల్యమైన మాటలతో సభను అలరించారు.
ఈ సమ్మిట్ ద్వారా తెలుగు వ్యాపార వేత్తల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా, భవిష్యత్తులో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.ఈ బిజినెస్ సమ్మిట్ ని విజయవంతం చేసిన స్పాన్సర్స్, మీడియా పార్ట్నర్,ప్రొడక్షన్ టీంకు అరుణ్ కుమార్ సుర్నిదా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ బిజినెస్ సమ్మిట్ లో 150 మందికి పైగా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.







తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









