అణు అత్యవసర పరిస్థితులపై కువైట్ సన్నద్ధత..!!
- June 17, 2025
కువైట్: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న వార్ నేపథ్యంలో ప్రాంతీయ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కువైట్ తన సంసిద్ధతను అంచనా వేయడానికి సమావేశమైంది. అణు రియాక్టర్ల నుండి తలెత్తే ప్రమాదాలు, నష్టాలను అంచనా వేయడానికి జాతీయ స్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్మీ జనరల్ స్టాఫ్ ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది. అత్యవసర పరిస్థితులు లేదా విపత్తులకు ప్రతిస్పందనకు కీలకమైన రంగాల సంసిద్ధతను సమీక్షించడానికి సైనిక, పౌర సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారని తెలిపారు. వీరిలో ఇంధనం, నీరు, ఆరోగ్య రంగాలలో ప్రతినిధులు..జాతీయ సామర్థ్యాలతో పాటు పర్యావరణ పర్యవేక్షణ వ్యూహాలు, పౌర రక్షణ ప్రణాళికలపై చర్చించారు. వాయు, సముద్ర సంక్షోభాలను అడ్డుకునేందుకు యంత్రాంగాల సన్నద్ధతను సమీక్షించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









