సౌదీ అరేబియాలో 700 కి పైగా కొత్త ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తింపు..!!
- June 18, 2025
రియాద్: జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో 744 కొత్త పురావస్తు ప్రదేశాలు నమోదు అయినట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. దీంతో ఆర్కియాలజికల్ సైట్స్ సంఖ్య మొత్తం 10,061కి చేరుకుందన్నారు. ఈ మైలురాయి సౌదీ అరేబియా సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
కొత్తగా నమోదు చేయబడిన సైట్లు రియాద్ (253), మక్కా (11), మదీనా (167), ఖాసిమ్ (30), తూర్పు ప్రావిన్స్ (13), అసిర్ (64), తబుక్ (72), హైల్ (13), ఉత్తర సరిహద్దులు (2), జజాన్ (23), నజ్రాన్ (86), అల్-జౌఫ్ (10) వంటి రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయని వెల్లడించారు.
బాలాగ్ ప్లాట్ఫామ్, అధికారిక సోషల్ మీడియా ఛానెల్లు లేదా 911 వద్ద యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా నమోదు చేయని సైట్ల వివరాలను అందజేయడం ద్వారా తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని హెరిటేజ్ కమిషన్ పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!