ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు..కువైట్ క్యాబినెట్ భేటీలో సమీక్ష..!!
- June 18, 2025
కువైట్: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో కువైట్ క్యాబనెట్ అత్యవసరంగా సమావేశమైంది. దేశంలో వైద్య, ఆహార సరఫరాలు, సేవలు నిరాంతరాయంగా అందేలా అన్ని మంత్రిత్వ శాఖల సన్నాహాలపై సమీక్షించారు. ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా అధ్యక్షతన బయాన్ ప్యాలెస్లో క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన అన్ని మెడిసిన్స్, వైద్య సామాగ్రిని అందించడానికి తన మంత్రిత్వ శాఖ సంసిద్ధత గురించి ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి వివరించారు.
వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఖలీఫా అల్-అజీల్ ఆహార భద్రతా స్టాక్, ప్రధానంగా వ్యూహాత్మక వస్తువులు, మార్కెట్ కదలికను పర్యవేక్షించే మార్గాలు, ఫుడ్, నీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వివరించారు. అదే విధంగా ప్రాంతీయంగా నెలకొన్ని సంఘర్షణ కారణంగా తలెత్తే అంశాలపై సమీక్షించారు. అత్యవసర పరిస్థితులు వస్తే.. అందుకు తగ్గట్టుగా సంసిద్ధంగా ఉండాలని, ఇందులో ముందుగానే సన్నాహాలను ముమ్మరం చేయాలని క్యాబినెట్ తీర్మానించింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









