ఆ మూడు దేశాలకు ఫ్లైట్ సస్పెన్షన్ను పొడిగించిన సలాం ఎయిర్..!!
- June 18, 2025
మస్కట్: ఆయా ప్రాంతాలలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్లకు.. అక్కడి నుండి వచ్చే విమానాల సస్పెన్షన్ను జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు సలాం ఎయిర్ ప్రకటించింది. ఈ మూడు దేశాలలో దేనిలోనైనా తుది గమ్యస్థానాలతో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణీకులను తదుపరి నోటీసు వచ్చే వరకు వారి అసలు బయలుదేరే స్థానం నుండి ప్రయాణానికి అనుమతి లేదని ఎయిర్లైన్ స్పష్టం చేసింది. తమ విమాన సర్వీసులకు సంబంధించి సకాలంలో అప్డేట్ లను పంపుతున్నట్లు తెలిపింది.
అలాగే సలాం ఎయిర్ వెబ్సైట్లోని “మేనేజ్ బుకింగ్ ” ద్వారా వారి మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చని ఎయిర్లైన్ తెలిపింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. పరిస్థితులు అనుకూలించిన తర్వాత ఈ గమ్యస్థానాలకు కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తామని సలాం ఎయిర్ వెల్లడించింది. సహాయం కోసం ప్రయాణీకులు +968 2427 2222 కు కాల్ చేయడం ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ చేయడం ద్వారా సలాం ఎయిర్ కస్టమర్ కేర్ను 24/7 సంప్రదించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









