సౌదీ అరేబియాలో 700 కి పైగా కొత్త ఆర్కియాలజికల్ సైట్స్ గుర్తింపు..!!
- June 18, 2025
రియాద్: జాతీయ పురాతన వస్తువుల రిజిస్టర్లో 744 కొత్త పురావస్తు ప్రదేశాలు నమోదు అయినట్లు హెరిటేజ్ కమిషన్ వెల్లడించింది. దీంతో ఆర్కియాలజికల్ సైట్స్ సంఖ్య మొత్తం 10,061కి చేరుకుందన్నారు. ఈ మైలురాయి సౌదీ అరేబియా సాంస్కృతిక వారసత్వం గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుందని పేర్కొన్నారు.
కొత్తగా నమోదు చేయబడిన సైట్లు రియాద్ (253), మక్కా (11), మదీనా (167), ఖాసిమ్ (30), తూర్పు ప్రావిన్స్ (13), అసిర్ (64), తబుక్ (72), హైల్ (13), ఉత్తర సరిహద్దులు (2), జజాన్ (23), నజ్రాన్ (86), అల్-జౌఫ్ (10) వంటి రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయని వెల్లడించారు.
బాలాగ్ ప్లాట్ఫామ్, అధికారిక సోషల్ మీడియా ఛానెల్లు లేదా 911 వద్ద యూనిఫైడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా నమోదు చేయని సైట్ల వివరాలను అందజేయడం ద్వారా తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని హెరిటేజ్ కమిషన్ పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









