ముత్తరహ్ లో 50 ఏళ్ల భారతీయుడిని గొంతు కోసి దారుణ హత్య

- July 13, 2016 , by Maagulf
ముత్తరహ్ లో  50 ఏళ్ల భారతీయుడిని గొంతు కోసి  దారుణ హత్య

మస్కట్ - గత ముప్పై ఏళ్లుగా ఎడారి దేశంలో ఉపాధి కొనసాగిస్తున్న ఒక భారతీయ వలసదారుడు మంగళవారం సాయంత్రం గొంతు కోయబడి ముత్తరహ్ సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. హతుడు  కేరళ రాష్ట్రం లోని  త్రివేండ్రంకు చెందిన 50 ఏళ్ల సత్యన్ తాను నివసిస్తున్న స్థానిక గృహావసరాల అపార్ట్మెంట్ సముదాయం కారిడార్ వద్ద గొంతు కోయబడి రక్తం మడుగులో విగతజీవిగా పడి ఉండటం మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇరుగుపొరుగు వారు కనుగొన్నారు.  
ఒక నివేదిక ప్రకారం...సత్యన్ ఒక ఆహార ఉత్పత్తుల పంపిణీదారుని వద్ద రోజువారీ సేకరణ ఏజెంట్ గా    జీవనం కొనసాగిస్తున్నాడు.15 వేల రియాల్ ఓమాన్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును సేకరిస్తారు. మరణించిన సత్యన్ గత 30 సంవత్సరాలుగా ఒమన్ లో  సౌమ్యుడిగా వివాదరహితుడిగా నివసిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com