హోమ్ రిటర్న్.. 123 మంది ఒమన్ పౌరుల ప్రయాణం సుఖాంతం..!!
- June 19, 2025
మస్కట్: విదేశాల నుండి ఒమన్ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. టెహ్రాన్లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయంతో సమన్వయంతో పౌరులను స్వదేశానికి తిరిగి పంపే ప్రణాళిక రెండవ దశ విజయవంతంగా నిర్వహించారు. 123 మంది ఒమన్ జాతీయులు బందర్ అబ్బాస్ ద్వారా సురక్షితంగా తిరిగి వచ్చారని, వారి ప్రయాణం సజావుగా జరిగిందని తెలిపారు. ఇరాన్ ఉత్తర ప్రాంతాల నుండి పౌరులను టర్కీ రిపబ్లిక్ సరిహద్దుకు పది బ్యాచులుగా తరలించినట్లు తెలిపారు. ఆయా దేశాల మద్దతుకు ఇరాన్ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒమానీ పౌరులందరూ స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు