గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్ట్.. సంఘర్షణలో 78 దేశాలు..!!
- June 19, 2025
యూఏఈ: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ సంవత్సరం అత్యంత అశాంతిగా ఉందని ఒక కొత్త అధ్యయనం తెలిపింది. ప్రపంచ శాంతియుతత తగ్గుతూనే ఉందని పేర్కొంది. ‘ప్రధాన సంఘర్షణలు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సంఘర్షణ, సాంప్రదాయ పొత్తుల విచ్ఛిన్నం, పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మరిన్ని దేశాలు తమ సైనికీకరణ స్థాయిలను పెంచుకుంటున్నాయని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ & పీస్ విడుదల చేసిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ తెలిపింది. ప్రస్తుతం 59 యాక్టివ్ స్టేట్స్ సంఘర్షణలు పడుతున్నాయని అధ్యయనం పేర్కొంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి ఇదే అత్యధికం అని, మునుపటి సంవత్సరం కంటే మూడు ఎక్కువ అని పేర్కొంది.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా, యుఎస్-రష్యా, చైనా-యుఎస్, ఇరాన్-యుఎస్, ఇజ్రాయెల్-సిరియా, అర్మేనియా-అజర్బైజాన్, ఇండియా-పాకిస్తాన్, ఈయు-రష్యా, యుకె-రష్యా, యుఎస్-వెనిజులా, యెమెన్-సౌదీ అరేబియా, తుర్కియే-యుఎస్ఎ, ఉత్తర కొరియా-యుఎస్, జర్మనీ-రష్యా, చైనా-తైవాన్, అనేక ఆఫ్రికన్ దేశాలు ప్రధాన సరిహద్దు వివాదాలలో ఉన్నాయి.
ఇజ్రాయెల్ -ఇరాన్ ప్రపంచ శాంతిని కుదిపేసిన తాజా సైనిక సంఘర్షణ అని తెలిపింది. జూన్ 13 (శుక్రవారం) ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. సైనిక, అణు స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకోవడంతో ఇరాన్ కు చెందిన పలువురు సైనికాధికారులు తెలిపారు. దాంతో ఉక్రెయిన్-రష్యా మరొక ప్రధాన సైనిక సంఘర్షణ అని పేర్కొంది.
78 దేశాలు సంఘర్షణల్లో..
ఈ అధ్యయనం 163 స్వతంత్ర దేశాలు, భూభాగాలను వాటి శాంతియుత స్థాయికి అనుగుణంగా ర్యాంక్ ఇస్తుంది. ఇది ప్రపంచ జనాభాలో 99.7 శాతాన్ని కవర్ చేస్తుందన్నారు. 78 దేశాలు తమ సరిహద్దు దేశాలతో ఘర్షణ ఉందన్నారు. గత రెండు సంవత్సరాలలో 106 దేశాలు సైనికీకరణ రంగంలో తగ్గుదల నమోదైందని తెలిపింది. "1970లలో 49 శాతంగా ఉన్న నిర్ణయాత్మక విజయంతో ముగిసిన ఘర్షణలు 2010లలో తొమ్మిది శాతానికి తగ్గాయి. అదే సమయంలో శాంతి ఒప్పందాల ద్వారా ముగిసిన ఘర్షణలు 23 శాతం నుండి నాలుగు శాతానికి తగ్గాయి." అని గ్లోబల్ పీస్ ఇండెక్స్ 19వ ఎడిషన్ తెలిపింది.
అత్యధిక , తక్కువ శాంతియుత దేశాలు
ఈ సంవత్సరం ఫలితాలు ప్రపంచ శాంతియుత స్థాయి 0.36 శాతం క్షీణించిందని, 74 దేశాలు మెరుగుపడగా, 87 దేశాలు క్షీణించాయని వెల్లడించింది. ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఐస్లాండ్ కొనసాగుతోంది. 2008 నుండి ఇది ఆ స్థానాన్ని నిలుపుకుంటుంది. ఈ సూచికలో ఐర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత అశాంతియుత దేశంగా రష్యా మొదటిసారిగా జాబితాలో నిలిచింది. తరువాత ఉక్రెయిన్, సూడాన్, కాంగో, యెమెన్ ఉన్నాయి.
ప్రాంతీయంగా పశ్చిమ, మధ్య ఐరోపా ప్రపంచంలో అత్యంత శాంతియుతంగా ఉండగా, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా (మెనా) ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత శాంతియుత ప్రాంతంగా మిగిలిపోయింది. దక్షిణాసియా రెండవ అత్యల్ప శాంతియుత ప్రాంతంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్లో అణచివేత చర్యలు, భారతదేశం - పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తత పెరగడం వల్ల దాని ర్యాంకింగ్ క్షీణించింది. 11 దేశాలలో ఏడు దేశాలు గత సంవత్సరం శాంతియుతంగా మెరుగుపడిన ఏకైక ప్రాంతం దక్షిణ అమెరికా అని నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్