ఇరాన్ నుంచి భారతీయుల‌ తరలింపు ప్రారంభం...

- June 20, 2025 , by Maagulf
ఇరాన్ నుంచి భారతీయుల‌ తరలింపు ప్రారంభం...

ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, భారతీయ విద్యార్థుల అత్యవసర తరలింపు కోసం ఇరాన్ తన మూసివేసిన గగనతలాన్ని తెరిచింది.

ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇరాన్ గగనతలం ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలకు మూసివేసింది. అయితే, భారతీయులను సురక్షితంగా తరలించడానికి ఇరాన్ ప్రత్యేక ఎయిర్ కారిడార్‌ను అందించినట్లు ప్రకటించింది.

ఈ పరిణామాల మధ్య భారత్ ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధు’ ద్వారా ఇరాన్‌లో చిక్కుకుపోయిన కనీసం 1,000 మంది భారతీయ విద్యార్థులు వచ్చే రెండు రోజుల్లో ఢిల్లీకి చేరుకోనున్నారు.

ఈ తరలింపులో భాగంగా మొదటి విమానం ఈ రోజు రాత్రి 11:00 గంటలకు (IST) ఢిల్లీలో ల్యాండ్ కానుంది. అనంత‌రం మరో రెండు విమానాలు (ఒకటి ఉదయం, మరొకటి సాయంత్రం) శనివారం బయలుదేరనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com