దుబాయ్ లో టూరిస్టుకు నెలరోజుల జైలుశిక్ష విధించిన కోర్టు..!!
- June 20, 2025
యూఏఈ: దుబాయ్లోని ఒక మాల్లోని లగ్జరీ రిటైల్ స్టోర్ నుండి 7,000 దిర్హామ్ల విలువైన డిజైనర్ హ్యాండ్బ్యాగ్ను దొంగిలించినందుకు ఒక మహిళా యూరోపియన్ పర్యాటకురాలికి ఒక నెల రోజుల జైలుశిక్ష విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను దేశం నుండి బహిష్కరించనున్నారు.
కోర్టు రికార్డుల ప్రకారం.. ఇటీవల ఈ సంఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులు ( ఒక పురుషుడు, నలుగురు మహిళలు ) కస్టమర్లుగా దుకాణాన్ని సందర్శించారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే దుకాణ సహాయకుడు హ్యాండ్బ్యాగ్ మాయం కావడాన్ని గమనించాడు. స్టోర్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, వారిలో ఒక మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న దుబాయ్ పోలీసులు అనుమానితురాలిని గుర్తించి, అరెస్టు చేశారు. అనంతరం మిస్డిమీనర్ కోర్టుకు రిఫర్ చేయగా.. ఆమెకు ఒక నెల జైలుశిక్ష, తరువాత బహిష్కరించాలని తీర్పు ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







