దుబాయ్ లో టూరిస్టుకు నెలరోజుల జైలుశిక్ష విధించిన కోర్టు..!!
- June 20, 2025
యూఏఈ: దుబాయ్లోని ఒక మాల్లోని లగ్జరీ రిటైల్ స్టోర్ నుండి 7,000 దిర్హామ్ల విలువైన డిజైనర్ హ్యాండ్బ్యాగ్ను దొంగిలించినందుకు ఒక మహిళా యూరోపియన్ పర్యాటకురాలికి ఒక నెల రోజుల జైలుశిక్ష విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను దేశం నుండి బహిష్కరించనున్నారు.
కోర్టు రికార్డుల ప్రకారం.. ఇటీవల ఈ సంఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులు ( ఒక పురుషుడు, నలుగురు మహిళలు ) కస్టమర్లుగా దుకాణాన్ని సందర్శించారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే దుకాణ సహాయకుడు హ్యాండ్బ్యాగ్ మాయం కావడాన్ని గమనించాడు. స్టోర్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, వారిలో ఒక మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న దుబాయ్ పోలీసులు అనుమానితురాలిని గుర్తించి, అరెస్టు చేశారు. అనంతరం మిస్డిమీనర్ కోర్టుకు రిఫర్ చేయగా.. ఆమెకు ఒక నెల జైలుశిక్ష, తరువాత బహిష్కరించాలని తీర్పు ప్రకటించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









