దుబాయ్ లో టూరిస్టుకు నెలరోజుల జైలుశిక్ష విధించిన కోర్టు..!!
- June 20, 2025
యూఏఈ: దుబాయ్లోని ఒక మాల్లోని లగ్జరీ రిటైల్ స్టోర్ నుండి 7,000 దిర్హామ్ల విలువైన డిజైనర్ హ్యాండ్బ్యాగ్ను దొంగిలించినందుకు ఒక మహిళా యూరోపియన్ పర్యాటకురాలికి ఒక నెల రోజుల జైలుశిక్ష విధించారు. జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఆమెను దేశం నుండి బహిష్కరించనున్నారు.
కోర్టు రికార్డుల ప్రకారం.. ఇటీవల ఈ సంఘటన జరిగింది. ఐదుగురు వ్యక్తులు ( ఒక పురుషుడు, నలుగురు మహిళలు ) కస్టమర్లుగా దుకాణాన్ని సందర్శించారు. వారు వెళ్లిన కొద్దిసేపటికే దుకాణ సహాయకుడు హ్యాండ్బ్యాగ్ మాయం కావడాన్ని గమనించాడు. స్టోర్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, వారిలో ఒక మహిళ చోరీ చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న దుబాయ్ పోలీసులు అనుమానితురాలిని గుర్తించి, అరెస్టు చేశారు. అనంతరం మిస్డిమీనర్ కోర్టుకు రిఫర్ చేయగా.. ఆమెకు ఒక నెల జైలుశిక్ష, తరువాత బహిష్కరించాలని తీర్పు ప్రకటించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: నర్సింగ్ కాలేజీల పై కొరడా
- శ్రీశైలంలో భారీ భద్రత మధ్య ప్రధాని మోదీ పర్యటన
- కరెంటు సరఫరా ప్రై’వేటు’!
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!