ఖతార్పై ఇరాన్ దాడి..యూఏఈలోని అల్ దఫ్రా స్థావరంలో యూఎస్ సైన్ అప్రమత్తం..!!
- June 24, 2025
యూఏఈ: ఖతార్లోని అల్ ఉదీద్లోని అమెరికా సైనిక స్థావరంపై సోమవారం రాత్రి ఇరాన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈలోని యూఎస్ బేస్ క్యాంప్ అప్రమత్తం అయింది. అబుదాబిలోని అల్ దఫ్రాలో ఉన్న (వారి) వైమానిక దళాల ప్రాణాలకు మరియు భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వైమానిక దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ (AFCENT) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్.. ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది ఖతార్ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టంతోపాటు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈ తన ఎయిర్ స్పేస్ ను రద్దు చేసింది. దాంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్









