ఖతార్పై ఇరాన్ దాడి..యూఏఈలోని అల్ దఫ్రా స్థావరంలో యూఎస్ సైన్ అప్రమత్తం..!!
- June 24, 2025
యూఏఈ: ఖతార్లోని అల్ ఉదీద్లోని అమెరికా సైనిక స్థావరంపై సోమవారం రాత్రి ఇరాన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈలోని యూఎస్ బేస్ క్యాంప్ అప్రమత్తం అయింది. అబుదాబిలోని అల్ దఫ్రాలో ఉన్న (వారి) వైమానిక దళాల ప్రాణాలకు మరియు భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వైమానిక దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ (AFCENT) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్.. ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది ఖతార్ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టంతోపాటు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈ తన ఎయిర్ స్పేస్ ను రద్దు చేసింది. దాంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్
- APL తొలి మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రానున్న రామ్ చరణ్
- ట్రంప్ అధికారాలకు బ్రేక్: ఇరాన్తో యుద్ధాన్ని నిరోధిస్తూ చారిత్రాత్మక తీర్మానం
- చిన్నారి పై హత్యాచారం.. కాలు పై కాల్చి మృగాడిని పట్టుకున్న పోలీసులు
- నార్త్ అల్ బతినాలో 'మ్యాంగో ఎక్స్ట్రావాగంజా' ప్రారంభం..!!
- ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్.. గత సీజన్ రికార్డులు బ్రేక్..!!
- ఫీజులు లేవు.. దుబాయ్లో ఉచిత ఇండోర్ ఫిట్నెస్ ఏరియా గురించి తెలుసా?
- కువైట్ సైన్యం స్పెషల్ ఆపరేషన్..పేలుడు పదార్థాలు నిర్వీర్యం..!!
- సౌదీ అరేబియా పశ్చిమ తీరానికి డస్ట్ అలెర్ట్ జారీ..!!
- ICRF 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' క్యాంపెయిన్ ప్రారంభం..!!







