ఖతార్పై ఇరాన్ దాడి..యూఏఈలోని అల్ దఫ్రా స్థావరంలో యూఎస్ సైన్ అప్రమత్తం..!!
- June 24, 2025
యూఏఈ: ఖతార్లోని అల్ ఉదీద్లోని అమెరికా సైనిక స్థావరంపై సోమవారం రాత్రి ఇరాన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈలోని యూఎస్ బేస్ క్యాంప్ అప్రమత్తం అయింది. అబుదాబిలోని అల్ దఫ్రాలో ఉన్న (వారి) వైమానిక దళాల ప్రాణాలకు మరియు భద్రతకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కాపాడటానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. వైమానిక దాడి తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్ (AFCENT) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్.. ఖతార్ లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోవడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది ఖతార్ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్టంతోపాటు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఉల్లంఘనగా పేర్కొంది. ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈ తన ఎయిర్ స్పేస్ ను రద్దు చేసింది. దాంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









