మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల కట్టడిపై జీసీసీ ఫోకస్..!!
- June 24, 2025
మనామా: కువైట్లో జరిగిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ల రెండవ సమావేశంలో బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్హా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా నాయకత్వం వహించారు. మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులకు వ్యతిరేకంగా పోరాటంలో సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. GCC దేశాల మధ్య సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక నేరాలను ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రయత్నాలను మెరుగుపరచడం, ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలతో మరింత సమన్వయం చేసుకోవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి. గల్ఫ్ అంతటా ఆర్థిక నిఘా కార్యకలాపాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశం GCC దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









