అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- June 24, 2025
దోహా, ఖతార్: అల్-ఉదీద్ యూఎస్ వైమానిక స్థావరంపై దాడిని ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్-అన్సారీ తన X ప్లాట్ఫామ్లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఖతార్ రాష్ట్ర సార్వభౌమాధికారం, దాని గగనతలం, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను ఇరాన్ ఉల్లంఘించిందని అన్నారు. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా..నేరుగా స్పందించే హక్కు ఖతార్కు ఉందన్నారు.
ఖతార్ వైమానిక రక్షణ దళాలు ఇరాన్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టాయని అన్నారు. ఇరానియన్ క్షిపణులతో నష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఇటువంటి తీవ్రతరమైన సైనిక చర్యలు కొనసాగడం వల్ల ఈ ప్రాంతంలో భద్రత దెబ్బతింటుందని, అంతర్జాతీయ శాంతి, భద్రతకు విఘాతం కలుగుతుందని తెలిపారు. అన్ని సైనిక చర్యలను వెంటనే నిలిపివేయాలని, వెంటనే దౌత్య మార్గంలో చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!