బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- October 16, 2025
మనామా: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 16–17 తేదీలలో ప్రవాస సంగమం కోసం బహ్రెయిన్లో పర్యటించనున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా మలయాళం మిషన్ మరియు లోక కేరళ సభ సభ్యులు నిర్వహించే గ్రాండ్ ప్రవాసీ సంగమంలో పాల్గొంటారు. ఇది అక్టోబర్ 17న సాయంత్రం 6:30 గంటలకు బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS)లో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొని మలయాళీ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్, మంత్రి సాజి చెరియన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. జయతిలక్ మరియు పారిశ్రామికవేత్త ఎం.ఎ. యూసుఫ్ అలీ వంటి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పి.వి. రాధాకృష్ణ పిళ్లై మరియు జనరల్ కన్వీనర్ పి. శ్రీజిత్ ప్రకటించారు.
తాజా వార్తలు
- మద్యం కొనాలంటే..క్యుఆర్ కోడ్ తప్పనిసరి!
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!