బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- October 16, 2025
మనామా: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్టోబర్ 16–17 తేదీలలో ప్రవాస సంగమం కోసం బహ్రెయిన్లో పర్యటించనున్నారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆయన బహ్రెయిన్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా మలయాళం మిషన్ మరియు లోక కేరళ సభ సభ్యులు నిర్వహించే గ్రాండ్ ప్రవాసీ సంగమంలో పాల్గొంటారు. ఇది అక్టోబర్ 17న సాయంత్రం 6:30 గంటలకు బహ్రెయిన్ కేరళీయ సమాజం (BKS)లో జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయన్ ముఖ్య అతిథిగా పాల్గొని మలయాళీ ప్రవాస సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి భారత రాయబారి వినోద్ కె. జాకబ్, మంత్రి సాజి చెరియన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. జయతిలక్ మరియు పారిశ్రామికవేత్త ఎం.ఎ. యూసుఫ్ అలీ వంటి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ పి.వి. రాధాకృష్ణ పిళ్లై మరియు జనరల్ కన్వీనర్ పి. శ్రీజిత్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!







