అమెరికా పౌరులు, ఇతర నివాసితులకు ఖతార్ సేఫ్..!!
- June 24, 2025
ఖతార్: కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశంలో భద్రతా పరిస్థితిలు నియంత్రణలో ఉందని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ప్రధాన మంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మజీద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఖతార్లో ఏ దేశ పౌరులకు ఎటువంటి అభద్రత భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఖతార్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం అమెరికన్ పౌరులకు ఒక ఇమెయిల్ పంపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు వారు ఆ ప్రదేశంలో ఆశ్రయం పొందాలని సిఫార్సు చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత ఈ అడ్వైజ్ జారీ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా ఖతార్ అధికారి పౌరులు, నివాసితులు ఇద్దరికీ భద్రతా సేవలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజా భద్రతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఖతార్.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. వెంటనే అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేసి.. చర్చలు, దౌత్య మార్గాలకు రావాల్సిన అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!