ఉద్యోగులకు రిమోట్ వర్క్ ప్రకటించిన అజ్మాన్..!!
- June 24, 2025
యూఏఈ: అజ్మాన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుండి ఆగస్టు 22 వరకు రిమోట్ పనిని ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ శుక్రవారం రిమోట్గా పని చేస్తారని, వారపు రోజుల పని గంటలు ఒక గంట తగ్గుతాయని తెలిపారు. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగులు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు పని చేస్తారు. అయితే, అవసరమైన ప్రజా సేవలను అంతరాయం లేకుండా అందించడానికి అనువైన అంతర్గత ఏర్పాట్లను అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త చొరవను క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమి నాయకత్వంలోని అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ నిర్ణయం అజ్మాన్ ప్రభుత్వం సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుందని షేక్ అమ్మర్ చెప్పారు. ఇది ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను ప్రోత్సహిస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం దుబాయ్ కూడా సౌకర్యవంతమైన పని గంటల విధానాన్ని ప్రకటించింది. ఈ చొరవ జూలై 1 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







