ఉద్యోగులకు రిమోట్ వర్క్ ప్రకటించిన అజ్మాన్..!!
- June 24, 2025
యూఏఈ: అజ్మాన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుండి ఆగస్టు 22 వరకు రిమోట్ పనిని ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ శుక్రవారం రిమోట్గా పని చేస్తారని, వారపు రోజుల పని గంటలు ఒక గంట తగ్గుతాయని తెలిపారు. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగులు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు పని చేస్తారు. అయితే, అవసరమైన ప్రజా సేవలను అంతరాయం లేకుండా అందించడానికి అనువైన అంతర్గత ఏర్పాట్లను అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త చొరవను క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమి నాయకత్వంలోని అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ నిర్ణయం అజ్మాన్ ప్రభుత్వం సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుందని షేక్ అమ్మర్ చెప్పారు. ఇది ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను ప్రోత్సహిస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం దుబాయ్ కూడా సౌకర్యవంతమైన పని గంటల విధానాన్ని ప్రకటించింది. ఈ చొరవ జూలై 1 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









