ఉద్యోగులకు రిమోట్ వర్క్ ప్రకటించిన అజ్మాన్..!!
- June 24, 2025
యూఏఈ: అజ్మాన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుండి ఆగస్టు 22 వరకు రిమోట్ పనిని ప్రకటించింది. సమ్మర్ నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులందరూ శుక్రవారం రిమోట్గా పని చేస్తారని, వారపు రోజుల పని గంటలు ఒక గంట తగ్గుతాయని తెలిపారు. సోమవారం నుండి గురువారం వరకు ఉద్యోగులు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 2.30 వరకు పని చేస్తారు. అయితే, అవసరమైన ప్రజా సేవలను అంతరాయం లేకుండా అందించడానికి అనువైన అంతర్గత ఏర్పాట్లను అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలను ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కొత్త చొరవను క్రౌన్ ప్రిన్స్ షేక్ అమ్మర్ బిన్ హుమైద్ అల్ నుయిమి నాయకత్వంలోని అజ్మాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ నిర్ణయం అజ్మాన్ ప్రభుత్వం సౌకర్యవంతమైన పని వాతావరణాన్ని సృష్టించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుందని షేక్ అమ్మర్ చెప్పారు. ఇది ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యతను ప్రోత్సహిస్తుందన్నారు.
ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం దుబాయ్ కూడా సౌకర్యవంతమైన పని గంటల విధానాన్ని ప్రకటించింది. ఈ చొరవ జూలై 1 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 12 వరకు కొనసాగనుంది. ఉద్యోగులను రెండు గ్రూపులుగా విభజించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









