అమెరికా పౌరులు, ఇతర నివాసితులకు ఖతార్ సేఫ్..!!
- June 24, 2025
ఖతార్: కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశంలో భద్రతా పరిస్థితిలు నియంత్రణలో ఉందని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ప్రధాన మంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మజీద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఖతార్లో ఏ దేశ పౌరులకు ఎటువంటి అభద్రత భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఖతార్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం అమెరికన్ పౌరులకు ఒక ఇమెయిల్ పంపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు వారు ఆ ప్రదేశంలో ఆశ్రయం పొందాలని సిఫార్సు చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత ఈ అడ్వైజ్ జారీ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా ఖతార్ అధికారి పౌరులు, నివాసితులు ఇద్దరికీ భద్రతా సేవలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజా భద్రతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఖతార్.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. వెంటనే అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేసి.. చర్చలు, దౌత్య మార్గాలకు రావాల్సిన అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









