అమెరికా పౌరులు, ఇతర నివాసితులకు ఖతార్ సేఫ్..!!
- June 24, 2025
ఖతార్: కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశంలో భద్రతా పరిస్థితిలు నియంత్రణలో ఉందని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ప్రధాన మంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మజీద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఖతార్లో ఏ దేశ పౌరులకు ఎటువంటి అభద్రత భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఖతార్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం అమెరికన్ పౌరులకు ఒక ఇమెయిల్ పంపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు వారు ఆ ప్రదేశంలో ఆశ్రయం పొందాలని సిఫార్సు చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత ఈ అడ్వైజ్ జారీ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా ఖతార్ అధికారి పౌరులు, నివాసితులు ఇద్దరికీ భద్రతా సేవలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజా భద్రతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఖతార్.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. వెంటనే అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేసి.. చర్చలు, దౌత్య మార్గాలకు రావాల్సిన అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







