అమెరికా పౌరులు, ఇతర నివాసితులకు ఖతార్ సేఫ్..!!
- June 24, 2025
ఖతార్: కొన్ని విదేశీ రాయబార కార్యాలయాలు తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో దేశంలో భద్రతా పరిస్థితిలు నియంత్రణలో ఉందని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ ప్రధాన మంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ మజీద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. ఖతార్లో ఏ దేశ పౌరులకు ఎటువంటి అభద్రత భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
ఖతార్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం అమెరికన్ పౌరులకు ఒక ఇమెయిల్ పంపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు వారు ఆ ప్రదేశంలో ఆశ్రయం పొందాలని సిఫార్సు చేసింది. ఆదివారం తెల్లవారుజామున ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత ఈ అడ్వైజ్ జారీ చేశారు.
దీనికి ప్రతిస్పందనగా ఖతార్ అధికారి పౌరులు, నివాసితులు ఇద్దరికీ భద్రతా సేవలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రజా భద్రతను కాపాడటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు ఖతార్.. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. వెంటనే అన్ని సైనిక కార్యకలాపాలను నిలిపివేసి.. చర్చలు, దౌత్య మార్గాలకు రావాల్సిన అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









