దేశీయ ఆయుధాలతో పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టింది మన సైన్యం - మోదీ
- June 24, 2025
న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉగ్రవాదంపై భారత్ కఠినమైన విధానాన్ని ఆపరేషన్ సిందూర్ ప్రపంచానికి స్పష్టం చేసిందన్నారు. ఉగ్రవాదంపై భారత్ దృఢవైఖరిని ఆపరేషన్ సిందూర్ నిరూపించిందని వ్యాఖ్యానించారు. భారత్పై ఉగ్రదాడులను సహించేది లేదన్నారు. ముష్కరులు ఎక్కడ నక్కినా అంతం చేస్తామని మోదీ తీవ్రంగా హెచ్చరించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆత్మనిర్భరత సాధించాం
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. ‘భారత్పై ఉగ్రదాడులను సహించేది లేదు. మన దేశంపై దాడులకు పాల్పడిన ముష్కరులు ఎక్కడ నక్కినా విడిచిపెట్టం. పాకిస్థాన్తో జరిగిన ఘర్షణలో భారతదేశంలో తయారైన ఆయుధాలు తమ ప్రభావాన్ని చూపించాయి. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాం. సైనిక అవసరాల కోసం విదేశాలపై మనం ఇప్పుడు తక్కువగా ఆధారపడుతున్నాం. ఆపరేషన్ సిందూర్లో దీని ప్రభావం కనిపించింది. దేశీయంగా తయారైన ఆయుధాలతో 22 నిమిషాల్లోనే పాకిస్థాన్ను మన సైన్యం మోకాళ్లపై కూర్చోబెట్టింది. భారతీయుల రక్తాన్ని పారించిన ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడా సురక్షితం కాదని నిరూపించాం’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
జాతీయభావన పెరిగింది
ఈ స్థావరాలు జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయ్బా వంటి ఉగ్రవాద సంస్థలకు చెందినవిగా గుర్తించారు.ఈ దాడుల్లో బ్రహ్మోస్ మిస్సైళ్లు, పినాకా మల్టిపుల్ రాకెట్ లాంచర్లు, నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు వంటి భారత్లో తయారైన ఆయుధాలు కీలకంగా ఉపయోగించబడ్డాయి. ఇవి DRDO, HAL, మరియు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ల సహకారంతో అభివృద్ధి చేయబడ్డాయి.ప్రధాని మోదీ ఈ విజయాన్ని ఆత్మనిర్భర భారత్ దిశగా భారత రక్షణ రంగం సాధించిన ప్రధాన మైలురాయిగా పేర్కొన్నారు. “ఇప్పుడిప్పుడే మనం విదేశీ ఆయుధాలపై ఆధారపడటం తగ్గించాం” అని మోదీ అన్నారు.ఈ చర్య తరువాత దేశవ్యాప్తంగా ప్రజలలో జాతీయభావన పెరిగింది. “ఊరుకోకుండా ప్రతిదాడికి సమర్థవంతమైన బదులివ్వగల భారత్ ఇప్పుడు ఉంది” అనే భావన ఏర్పడింది. రాజకీయ వర్గాలు కూడా రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి మరింత బలమిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పర్యటనకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్..!!
- మక్కాలో కింగ్ సల్మాన్ గేట్ ప్రాజెక్టు ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో స్కూళ్లకు నాలుగు రోజులపాటు దీపావళి సెలవులు..!!
- కార్నిచ్లో న్యూ రోడ్డు రెండు రోజులపాటు మూసివేత..!!
- కువైట్ లో ఇల్లీగల్ పార్కింగ్లపై కొరడా..!!
- ముసందంలో పర్యాటక సీజన్ కు సన్నాహాలు..!!
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!