ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ..యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ రూలర్ భేటీ..!!

- June 26, 2025 , by Maagulf
ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ..యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ రూలర్ భేటీ..!!

దోహా: యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ దోహాలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తనీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. అలాగే, మధ్యప్రాచ్యంలో తాజా పరిణామాలను, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా ఇద్దరు నాయకులు సమీక్షించారు.

ఉమ్మడి గల్ఫ్ సహకారానికి మద్దతు ఇవ్వడానికి వారి భాగస్వామ్య నిబద్ధతకు అనుగుణంగా, రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఖతార్‌కు విచ్చేసిన యూఏఈ అధ్యక్షుడికి షేక్ తమీమ్ సాదర స్వాగతం పలికారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలను షేర్ చేసుకున్నారని అధికార యంత్రాంగం తెలిపింది.  ఈ సందర్భంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో షేక్ తమీమ్ చేసిన కృషిని యూఏఈ ప్రెసిడెంట్ ప్రశంసించారు.

ఇటీవల తమ భూభాగంపై జరిగిన దాడి నేపథ్యంలో ఖతార్ పాలకుడికి సంఘీభావాన్ని తెలియజేశారు. ఖతార్ తన భద్రతకు తీసుకోనే ఏ చర్యకైనా యూఏఈ పూర్తి మద్దతును తెలుపుతుందని ఆయన స్పష్టం చేశారు.  

ఈ సమావేశంలో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్; ప్రెసిడెన్షియల్ కోర్ట్ ఫర్ స్పెషల్ అఫైర్స్ డిప్యూటీ చైర్మన్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్; యూఏఈ అధ్యక్షుడి సలహాదారు షేక్ మొహమ్మద్ బిన్ హమద్ బిన్ తహ్నూన్ అల్ నహ్యాన్ లతోపాటు అనేక మంది మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత, షేక్ మొహమ్మద్ బయలుదేరారు. ఆయనకు షేక్ తమీమ్, అనేక మంది షేక్‌లు,  సీనియర్ అధికారులు వీడ్కోలు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com