దుబాయ్ లో భారతీయ వ్యాపారి హత్య కేసు..ఐదుగురి పై విచారణ ముమ్మరం..!!
- June 28, 2025
దుబాయ్: దుబాయ్ లోని అల్ వుహైదా ప్రాంతంలోని విల్లాలో ఇటీవల జరిగిన దోపిడీలో 55 ఏళ్ల భారతీయ వ్యాపారిని చంపిన ఐదుగురు వ్యక్తుల కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారించడం ప్రారంభించింది.
కోర్టు ఫైళ్ల ప్రకారం.. నిందితులు అందరూ పాకిస్తాన్ జాతీయులు. బాధితుడి విల్లాలోకి చొరబడి, అతన్ని కట్టివేసి, పదునైన వస్తువుతో గొంతు కోసి చంపారని కేసులు నమోదు చేశారు. అక్కడి నుండి నగదు, పాస్పోర్ట్లు, ఆభరణాలను చోరీ చేశారని తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణులు, CID అధికారులతో సహా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విల్లాలోని భద్రతా కెమెరాల ఫుటేజ్లో నేరం జరిగిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు ప్రవేశించినట్లు కనిపించింది. ఇరవై నిమిషాల తర్వాత, వారు చోరీ సొత్తుతో వెళ్లడం కనిపించింది. కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో బాధితుడికి అనేక గాయాలు అయ్యాయని, దాడి చేసిన వారిని ప్రతిఘటించిన తర్వాత చివరికి గొంతు కోసి చంపబడ్డాడని నిర్ధారించారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పాకిస్తాన్ లోని విమానాశ్రయంలో మరో ఇద్దరిని అరెస్టు చేసి, తరువాత యూఏఈకి తీసుకొచ్చారు. విచారణ సమయంలో ఐదుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా