మైక్రోసాఫ్ట్లో ఉద్యోగాల ఊచకోత..!
- June 28, 2025
అమెరికా: ఉద్యోగాల ఊచకోతకు సిద్ధమైంది దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్. ఇప్పటికే గత నెలలో 6వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపేసిన మైక్రోసాఫ్ట్..మొత్తం సిబ్బందిలో 3శాతం మందిని తొలగించింది. తాజాగా మరోసారి ఉద్యోగులపై వేటు వేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించడం ఉద్యోగులను టెన్షన్ పెడుతోంది.వచ్చే నెలలో మరింత మందిపై వేటు తప్పదని సత్య నాదెళ్ల హెచ్చరించడం కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా లేఆఫ్స్ కు సిద్ధమవుతున్నట్లు ఆయన ప్రకటించడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఏఐ, ఆటోమేషన్..ఉద్యోగాల కోతకు కారణంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఖండించారు.ఏఐ టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా ఒక మంచి టెక్నాలజీ నిపుణులుగా ఎదగాలంటే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లంతా బేసిక్ అంశాలపై పట్టు సాధించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.హెల్త్ కండీషన్ తో పాటు పేపర్ వర్క్ వంటి రోజువారీ పనులను ఏఐ సులభతరం చేయాలన్నారు.
సామాజిక విలువలతో కూడిన శక్తి వినియోగాన్ని సమర్థించేందుకు ఏఐ వినియోగం పెంచాలని ఐటీ సంస్థలకు సత్య నాదెళ్ల సూచించారు. కృతిమ మేధస్సుతో వేగంగా మారుతున్న టెక్నాలజీని వినియోగించుకునేందుకు ఏఐ వంటి అపారమైన శక్తిని పరిగణలోకి తీసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్స్ సూచిస్తున్నారు.రోజువారీ సవాళ్లను సులభతరం చేయగలదా లేదా అనేది ఏఐ విజయంతోనే సాధ్యపడుతుందని అంటున్నారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా