దుబాయ్ లో భారతీయ వ్యాపారి హత్య కేసు..ఐదుగురి పై విచారణ ముమ్మరం..!!
- June 28, 2025
దుబాయ్: దుబాయ్ లోని అల్ వుహైదా ప్రాంతంలోని విల్లాలో ఇటీవల జరిగిన దోపిడీలో 55 ఏళ్ల భారతీయ వ్యాపారిని చంపిన ఐదుగురు వ్యక్తుల కేసును దుబాయ్ క్రిమినల్ కోర్టు విచారించడం ప్రారంభించింది.
కోర్టు ఫైళ్ల ప్రకారం.. నిందితులు అందరూ పాకిస్తాన్ జాతీయులు. బాధితుడి విల్లాలోకి చొరబడి, అతన్ని కట్టివేసి, పదునైన వస్తువుతో గొంతు కోసి చంపారని కేసులు నమోదు చేశారు. అక్కడి నుండి నగదు, పాస్పోర్ట్లు, ఆభరణాలను చోరీ చేశారని తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణులు, CID అధికారులతో సహా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. విల్లాలోని భద్రతా కెమెరాల ఫుటేజ్లో నేరం జరిగిన రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ముగ్గురు నిందితులు ప్రవేశించినట్లు కనిపించింది. ఇరవై నిమిషాల తర్వాత, వారు చోరీ సొత్తుతో వెళ్లడం కనిపించింది. కోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ నివేదికలో బాధితుడికి అనేక గాయాలు అయ్యాయని, దాడి చేసిన వారిని ప్రతిఘటించిన తర్వాత చివరికి గొంతు కోసి చంపబడ్డాడని నిర్ధారించారు.
దర్యాప్తు చేపట్టిన అధికారులు ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో పాకిస్తాన్ లోని విమానాశ్రయంలో మరో ఇద్దరిని అరెస్టు చేసి, తరువాత యూఏఈకి తీసుకొచ్చారు. విచారణ సమయంలో ఐదుగురు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







