17 ఏళ్ల తర్వాత హంతకుడిపై సీబీఐ ఛార్జ్ షీట్..Dh300 కోసం యూఏఈలో మర్డర్..!!
- June 29, 2025
యూఏఈ: అబుదాబిలో ఒక భారతీయుడు హత్య కేసుకు సంబంధించి దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్ లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) హంతకుడిపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కేవలం Dh300 ఫోన్ బిల్లుల చెల్లింపు కోసం మర్డర్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు ఇందర్ జిత్ సింగ్పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద స్థానిక ప్రాసిక్యూషన్ను ప్రారంభించినట్లు వెల్లడించింది.
ఈ కేసు ఆగస్టు 28, 2008న జరిగింది. అంతర్జాతీయ సిమ్ కార్డుల వివాదం తర్వాత యూఏఈ రాజధాని అబుదాబిలో సింగ్ తోటి భారతీయుడు రామ లింగం నటేసన్ను కత్తితో పొడిచి చంపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. CBI ఛార్జిషీట్ ప్రకారం.. సింగ్ కోసం నటేసన్ క్రెడిట్పై సిమ్ కార్డులను సింగ్ విక్రయించేవాడు. ఈ క్రమంలో బకాయిలు Dh300కి చేరుకుంది. నటేసన్ సింగ్ తన జీతం నుండి బకాయిలను తగ్గించమని కోరినప్పుడు, సింగ్ అతన్ని చంపడానికి పథకం పన్నాడని ఆరోపణలు ఉన్నాయి. అతను నటేసన్పై పదునైన కత్తితో దాడి చేసి, ప్రాణాంతకమైన గాయాలను కలిగించాడని తెలిపింది.
అనంతరం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖతో యూఏఈ అధికారులు కలిసి ఆధారాలు సేకరించినట్లు CBI తెలిపింది. భారత హోం మంత్రిత్వ శాఖ అనుమతితో, ఏజెన్సీ ఇప్పుడు న్యూఢిల్లీలోని ఒక ప్రత్యేక కోర్టులో అధికారిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
మరోకేసులో.. 2011లో బహ్రెయిన్లో తన యజమానిని హత్య చేసినందుకు CBI మరో భారతీయుడు సుభాష్ చందర్ మహ్లాపై కూడా అభియోగం మోపింది. డ్రైవర్గా పనిచేసిన మహ్లా.. తన యజమానిపై ఆయుధంతో దాడి చేసినట్లు CBI తెలిపింది. అతనిపై IPC సెక్షన్లు 302, 404 కింద అభియోగాలు మోపబడ్డాయి.
యూఏఈ, బహ్రెయిన్ అధికారుల అభ్యర్థన మేరకు రెండు ప్రాసిక్యూషన్లు ప్రారంభించినట్టు తెలిపారు. విదేశాలలో జరిగిన నేరాలకు భారతీయ పౌరులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతను ఈ కేసుల పురోగతి ప్రతిబింబిస్తుందని సీబీఐ తెలిపింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









