సెప్టెంబర్లో మాన్సూన్ ఫెస్టివల్
- July 14, 2016
కేరళ నుంచి మాన్సూన్ ఫెస్టివల్ని నిర్వహించేందుకు సెప్టెంబర్ నెల వేదిక కానుంది. 2005లో కేరళలో ప్రారంభమైన మాన్సూన్ సినీ ఫెస్టివల్ ఇప్పుడు దుబాయ్, అబుదాబీ మరియు షార్జాలకు విస్తరించింది. పాన్ అరబ్ టూర్లో భాగంగా కేరళ ప్రభుత్వ సహకారంతో ఈ ఫెస్టివల్స్ని నిర్వహిస్తున్నారు. గల్ఫ్ రీజియన్ కోసం తొలిసారిగా మాన్సూన్ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు. 'కోచి మెట్రో షార్ట్ ఫిలింస్ యూఏఈ' పేరుతో నిర్వహించనున్న ఈ ఈవెంట్లో 50 షార్ట్ ఫలింస్ని ప్రదర్శిస్తారు. సినిమా ద్వారా సమాజానికి సంబంధించి అనేక ముఖ్యమైన అంశాల్ని ప్రస్తావించి, ప్రజల్ని జాగృతం చేసే అవకాశముందని ఫెస్టివల్ డైరెక్టర్ రవీందర్ చెప్పారు. యూఏఈని బేస్ చేసుకుని రవీందర్ ఓ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా షార్ట్ ఫిలింస్నీ, మూవీ మేకింగ్ కాన్సెప్ట్లనీ షేర్ చేస్తున్నారు. మాన్సూన్ సినీ ఫెస్టివల్లో అరేబియన్ ఫ్రేమ్స్ అనే షార్ట్ పిలిం ఫెస్టివల్ ప్రత్యేకంగా దుబాయ్, అబుదాబీకి చెందినవారి కోసం కేరళలోని కోచి, కోజికోడ్, తిరువనంతపురంలోనూ నిర్వహించనున్నట్లు తెలిపారాయన. గల్ఫ్ రీజియన్, కేరళీయులకు రెండో స్వస్థలంగా వర్ధిల్లుతోందనీ, అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు రవీంద్రన్.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







