మహిళ ప్రసవించే సన్నివేశం : ‘స్క్విడ్ గేమ్-3’పై విమర్శలు
- June 29, 2025
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ (OTT) ప్రేక్షకుల మనసులను దోచుకున్న సిరీస్ ‘స్క్విడ్ గేమ్’. ప్రతి సీజన్కి అభిమానుల నుంచి అపారమైన స్పందన లభిస్తోంది. అయితే, తాజాగా వచ్చిన మూడో సీజన్లో ఒక సన్నివేశం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ సీన్ వాస్తవికత లేకుండా చూపించారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.ఈ వివాదాస్పద సన్నివేశం సీజన్ 3లోని రెండో ఎపిసోడ్లో వస్తుంది. ఇందులో ‘కిమ్ జున్ హీ’ పాత్రధారి ఆకస్మికంగా ప్రసవ వేదనకు లోనవుతుంది. తోటి కంటెస్టెంట్ ‘గెమ్ జా’ సాయంతో కేవలం ఐదు నిమిషాల్లోనే ఆమె బిడ్డకు జన్మనిస్తుంది. అది కూడా ఎలాంటి వైద్య సాయం లేకుండా, నొప్పులు లేకుండా. ప్రసవానంతరం ఎటువంటి అలసట కనిపించకుండా మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోతుంది.
నెటిజన్ల అసహనం ఎక్కడికి చేరిందంటే…
ఈ సన్నివేశం ప్రసారమైన వెంటనే విమర్శల తుపాను వచ్చేసింది. ‘‘నీళ్లు పోగానే బిడ్డ పుట్టింది, వెంటనే లేచి నడిచింది’’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ 75 లక్షల వ్యూస్ను దాటింది. ‘‘ఈ బిడ్డకు కూడా సిన్సియరిటీ ఎక్కువేమో, ఏడవాల్సిన టైమ్కి ఏడుస్తుంది’’ అంటూ వ్యంగ్యంగా స్పందించారు మరికొందరు.
దర్శకుడి పై నిప్పులు చెరిగిన వ్యాఖ్యలు
ప్రసవం ప్రక్రియపై కనీస అవగాహన లేకుండా దర్శకుడు ఇలా చూపించారని మండిపడుతున్నారు. వైద్య నిపుణుల గైడ్లైన్స్ తీసుకోకుండా చిత్రీకరించడం, మూత్రపిండాలు, రక్తస్రావం, శ్రమ తతంగాలేమీ చూపించకపోవడం విమర్శలకు దారితీసింది. ‘‘ఇది సోమరి రచనకు నిదర్శనం’’ అంటూ నెటిజన్లు తిప్పి పొడుస్తున్నారు.
కొంతమంది మద్దతు…కానీ మెజారిటీ నిరసన
కొంతమంది ఈ సీన్ను ఓర్పు, జీవన జ్ఞానంగా చెబుతున్నా, చాలా మంది మాత్రం అంగీకరించలేకపోతున్నారు. ముఖ్యంగా, ప్రసవం తర్వాత తల్లి స్కిప్పింగ్ చేయడం మరింత చర్చకు తావిచ్చింది. ఇది ‘స్క్విడ్ గేమ్’ వాస్తవికతకు దూరంగా ఉందని విశ్లేషకుల అభిప్రాయం.‘స్క్విడ్ గేమ్’ తరచూ సామాజిక అంశాలపై గంభీరంగా స్పందిస్తుంటుంది. కానీ, ఇలాంటి సన్నివేశాల ద్వారా సిరీస్ మీద ప్రజల్లో విరక్తి పెరుగుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సీన్ వల్ల సిరీస్ను మానేస్తున్నట్లు పలువురు నెటిజన్లు ప్రకటించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







