అబుదాబిలోని ఈ బీచుల్లో స్విమ్మింగ్ చేయడం ప్రమాదకరం..!!
- June 30, 2025
యూఏఈ: అబుదాబిలోని నివాసితులు, సందర్శకులు తీరప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాలలో స్విమ్మింగ్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. అల్ బహియా సముద్రం నుండి అల్ షాలిలా ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిషేధిత తీర ప్రాంతాలలో ఈతకు దూరంగా ఉండాలని మునిసిపాలిటీలు, రవాణా శాఖతో పాటు అధికారులు ప్రజలను కోరారని తెలిపారు.
ఆలల తీవ్రత అధికంగా ఉండటంతోపాటు నీటి అడుగున అడ్డంకులు ఉండటం వంటి అనేక కారణాల వల్ల, రెస్క్యూ బృందాలు లేకపోవడంతో పాటు ఈ ప్రదేశాలు ప్రజా భద్రతకు ప్రమాదకరంగా మారవచ్చని తెలిపారు. ఈత కొట్టడం వల్ల మునిగిపోవడం లేదా గాయపడే అవకాశాలు ఉంటాయని అధికారులు హెచ్చరించినందున, ఈత కొట్టకుండా చూసుకోవడానికి ఈ ప్రాంతాలలో స్పష్టమైన హెచ్చరిక బోర్డులను పెట్టినట్టు తెలిపారు.
ఈ ప్రాంతాల్లో పిల్లలు ఈత కొట్టకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుటుంబాలు తమ పిల్లలను రక్షణకు లైఫ్గార్డ్ స్టేషన్లు అందుబాటులో ఉన్న నియమిత ప్రాంతాలలో మాత్రమే ఈత కొట్టించాలని సూచించారు.
గత సంవత్సరం, దుబాయ్లోని అల్ మమ్జార్ బీచ్ నుండి ఈత కొడుతుండగా బలమైన ఆలలలో చిక్కుకుని 15 ఏళ్ల భారతీయ ప్రవాసి మునిగిపోయాడు. 2022లో, అబుదాబిలోని ఒక దీవుల బీచ్లో 31 ఏళ్ల వ్యక్తి ఈత కొడుతుండగా మునిగిపోయి మరణించాడు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా