యూఏఈ గోల్డెన్ వీసా విస్తరణ.. ఏఐ, ఐఓటీ, వెల్త్ నిపుణులకు స్వాగతం..!!
- June 30, 2025
యూఏఈ: యూఏఈ తన అత్యంత ప్రజాదరణ పొందిన గోల్డెన్ వీసా కార్యక్రమం పరిధిని విస్తరించింది. విదేశీ పెట్టుబడులు, సంపదను ఆకర్షించడం నుండి ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలిక విలువ సృష్టిని పెంపొందించడం వైపు దృష్టి సారించిందని నిపుణులు తెలిపారు. JSB వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ కేస్వానీ ప్రకారం.. కంపెనీ వ్యవస్థాపకులు, టెక్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులను ఇప్పుడు వారి పెట్టుబడుల పరిమాణంపై మాత్రమే కాకుండా స్థానిక పర్యావరణ వ్యవస్థపై వారు తీసుకురాగల మొత్తం ప్రభావంపై కూడా అంచనా వేసి వీసాలను అందజేస్తున్నారు. “ఇప్పుడు గోల్డెన్ వీసా పరిధి పెరిగింది. AI, IoT, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రైవేట్ సంపద నిర్వహణ వంటి రంగాల నుండి అభ్యర్థులను చూస్తున్నాము. ప్రభుత్వ విధానం విస్తరించింది.ఇది ఇప్పుడు విస్తృత సమాజానికి దోహదపడగల ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది.” అని గౌరవ్ కేస్వానీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
కాగా, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి యూఏఈ 2019లో తన దీర్ఘకాలిక నివాస కార్యక్రమం గోల్డెన్ వీసాల జారీని ప్రవేశపెట్టింది. తాజా గణాంకాల ప్రకారం, 2023లో దుబాయ్లో మాత్రమే 158,000 మంది గోల్డెన్ వీసాలు పొందారు. వీరిలో దాదాపు 40 శాతం మంది పెట్టుబడిదారులు, మిగిలిన 60 శాతం మంది వివిధ ఇతర రంగాలలో ప్రతిభను కలిగి ఉన్నారు. "మొత్తంలో దాదాపు 22 శాతం మంది బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ రంగాలకు చెందిన నిపుణులు, AI తోపాటు వాతావరణ మార్పులలో నిఫుణులు కూడా ఉన్నారు" అని కేస్వానీ పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్ 20 హెడ్జ్ ఫండ్లలో ఎనిమిది యూఏఈలో తమ సంస్థలను స్థాపించడం, దాదాపు $48 బిలియన్ల వ్యాపారాన్ని అవి తీసుకొచ్చాయని తెలిపారు. అదే సమయంలో వారి అవసరాలను ఆప్టిమైజ్ చేయడానికి సరైన ప్రతిభావంతులు అవసరం అవుతుందన్నారు. అందుకే ప్రభుత్వం ఆయా రంగాల్లోని ప్రతిభావంతులను ఆకర్షించేందుకు సిద్ధమైందని తెలిపారు.
గోల్డెన్ వీసా ప్రస్తుతం అత్యుత్తమ విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అగ్రశ్రేణి ప్రపంచ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్లు, కోడర్లు, అధిక అర్హత కలిగిన నిపుణులతో సహా విస్తృత ప్రతిభ కలిగిన వ్యక్తులకు 10 సంవత్సరాల నివాస అవకాశాన్ని అందిస్తుంది. గత ఆరు నెలల్లో 250 మందికి పైగా వ్యక్తులకు వీసాలు ఏర్పాటు చేసిన కేస్వానీ ప్రకారం, సమీప భవిష్యత్తులో అదనపు వర్గాలకు ఈ వీసా విస్తరణ కొనసాగుతుందన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!