పీక్ అవర్స్ లో విద్యుత్తును ఆదా చేయండి..!!
- July 01, 2025
కువైట్: కువైట్ అత్యంత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నందున, ముఖ్యంగా పీక్ అవర్స్లో విద్యుత్తును ఆదా చేయాలని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. విద్యుత్తును ఆదా చేయడం ఉమ్మడి బాధ్యత అని , విద్యుత్ కోతలను నివారించడంలో సహాయపడుతుందని సహల్ యాప్ ద్వారా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.
ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఒకేసారి ఎక్కువ ఉపకరణాలను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, సోమవారం విద్యుత్ లోడ్ 16,841 మెగావాట్లకు చేరుకుందని, ఇది 17,000 మెగావాట్ల పరిమితికి దగ్గరగా ఉందని పేర్కొంది. విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించడానికి, అన్ని ప్రాంతాలకు నిరంతర సరఫరాను కొనసాగించడానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







