ఇండియన్ అంబాసిడర్తో తెలుగుదేశం కువైట్ కమిటీ భేటీ
- July 14, 2016
తెలుగుదేశం కువైట్ కమిటీ, ఇండియన్ అంబాసిడర్ శ్రీ సునీల్ జైన్ను జులై 12న కలిశారు. ప్రెసిడెంట్ కుదరవల్లి సుధాకర్రావు, కొత్త కమిటీని ఇండియన్ అంబాసిడర్కు పరిచయం చేశారు. జనరల్ సెక్రెటరీ రామ్ కొత్తపల్లి, ఇండియన్ కమ్యూనిటీకి, ప్రత్యేకించి తెలుగు కమిటీకి ఇండియన్ అంబాసిడర్ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఇండియన్ అంబాసిడర్కి కృతజ్ఞతలు తెలిపారు. వెల్ఫేర్ కో-ఆర్డినేటర్ రవికుమార్ రాజు, తెలుగుదేశం కువైట్ కమిటీ చేపడ్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఇండియన్ ఎంబసీలో తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాల్సిందిగా మరో వెల్ఫేర్ కోఆర్డినేటర్ మురళి విజ్ఞప్తి చేశారు. టిడిపి కువైట్ వెల్ఫేర్ కో-ఆర్డినేటర్స్ ఇండియన్ ఎంబసీలో రోజువారీ కార్యక్రమాల కోసం యాక్సెస్ పొందేలా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలని కోరగా, దానికి శ్రీ సునీల్ జైన్ సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం ప్రెసిడెంట్ కుదరవల్లి సుధాకర్రావు డొనేట్ చేసిన అంబులెన్స్ వివరాల్ని అంబాసిడర్కి వివరించారు. విజయవాడ, విశాఖపట్నం, చెన్నయ్, తిరుపతి, హైద్రాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి డెడ్ బాడీస్ని తరలించేందుకు వీటిని వినియోగించనున్నట్లు ప్రతినిథులు వివరించారు.


తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









