హిందూపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం
- July 04, 2025
హిందూపురం: తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే ప్రజా చైతన్య కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ లక్ష్యాలను, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామర్థ్యవంతమైన పాలన విధానాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
పూజలతో ప్రారంభం–ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ పీఏ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేతలు మొదట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అధికారికంగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవలు, సుపరిపాలన లక్ష్యాలు తెలియజేశారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటూ, వారికి జవాబుదారీ పాలనను హామీ ఇస్తున్నారు.
ప్రజలతో మమేకం
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అశ్వర్థ రెడ్డి, శ్రీదేవి, అంజనమ్మ, లక్ష్మీదేవి తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజలతో మమేకమవుతూ వారికి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలు ఎలా వస్తున్నాయో వివరించారు.ప్రజల విశ్వాసాన్ని పొందే దిశగా ఈ ప్రచారం ముందుకు సాగుతుండగా, పార్టీ శ్రేణులు కూడా స్ఫూర్తితో చొరవ చూపిస్తున్నాయి.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









