బల్గెరియా ప్రెసిడెన్షియల్ మెడల్ అందుకున్న సయ్యద్ బదర్..!!
- July 05, 2025
సోఫియా: సోఫియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో శుక్రవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో బల్గేరియా రిపబ్లిక్ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్.. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదికి అధ్యక్షుడి బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అవార్డును ప్రదానం చేశారు. ఈ పతకం బల్గెరియా అందజేసే అత్యున్నత అవార్డులలో ఒకటి. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన అత్యుత్తమ కృషికి గుర్తింపుగా దీనిని ప్రదానం చేసారు.
ఈ సందర్భంగా బల్గేరియన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఒమన్ సుల్తానేట్ చేపట్టిన మానవతా ప్రయత్నాల పట్ల బల్గేరియన్ ప్రజలు గౌరవాన్ని వ్యక్తం చేశారని, దీని ఫలితంగా గెలాక్సీ లీడర్ షిప్లోని బల్గేరియన్ సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు. శాంతి, మానవ సంఘీభావాన్ని ప్రోత్సహించడంలో సుల్తానేట్ నిజమైన విలువలను ప్రతిబింబించే గొప్ప మనసును చాటుకుందని కొనియాడారు. సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో ఒమన్ అభివృద్ధి పథాన దూసుకుపోతుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా సయ్యద్ బదర్ బల్గెరియా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పతకం ప్రపంచ ప్రజలను ఏకం చేసే సాధారణ సార్వత్రిక విలువలను కలిగి ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!







