బల్గెరియా ప్రెసిడెన్షియల్ మెడల్ అందుకున్న సయ్యద్ బదర్..!!
- July 05, 2025
సోఫియా: సోఫియాలోని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో శుక్రవారం జరిగిన అధికారిక కార్యక్రమంలో బల్గేరియా రిపబ్లిక్ అధ్యక్షుడు రుమెన్ రాదేవ్.. ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదికి అధ్యక్షుడి బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అవార్డును ప్రదానం చేశారు. ఈ పతకం బల్గెరియా అందజేసే అత్యున్నత అవార్డులలో ఒకటి. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చేసిన అత్యుత్తమ కృషికి గుర్తింపుగా దీనిని ప్రదానం చేసారు.
ఈ సందర్భంగా బల్గేరియన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఒమన్ సుల్తానేట్ చేపట్టిన మానవతా ప్రయత్నాల పట్ల బల్గేరియన్ ప్రజలు గౌరవాన్ని వ్యక్తం చేశారని, దీని ఫలితంగా గెలాక్సీ లీడర్ షిప్లోని బల్గేరియన్ సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు. శాంతి, మానవ సంఘీభావాన్ని ప్రోత్సహించడంలో సుల్తానేట్ నిజమైన విలువలను ప్రతిబింబించే గొప్ప మనసును చాటుకుందని కొనియాడారు. సుల్తాన్ హైతం బిన్ తారిక్ నాయకత్వంలో ఒమన్ అభివృద్ధి పథాన దూసుకుపోతుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా సయ్యద్ బదర్ బల్గెరియా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పతకం ప్రపంచ ప్రజలను ఏకం చేసే సాధారణ సార్వత్రిక విలువలను కలిగి ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!