రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి BD9,400 పరిహారం: కోర్టు
- July 05, 2025
మనామా: బహ్రెయిన్ రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొన్న తర్వాత అతనికి BD9,400 పరిహారం పెంచుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ వ్యక్తి రిఫాలో రోడ్డుపైకి అడుగు పెడుతుండగా, డ్రైవర్ అతన్ని గుర్తించలేక ఢీకొన్నాడు. ఇందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతని శాశ్వత వైకల్యాన్ని 15 శాతంగా లెక్కగట్టారు.
అప్పీల్స్ కోర్టు గతంలో BD8,900 మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.దీనిపై డ్రైవర్ కారును కవర్ చేసిన బీమా సంస్థ మొదటి తీర్పును సవాలు చేసింది. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను పరిశీలించిన కోర్టు..నుదిటిలో విరిగిన ఎముక, తలపై గాయం, ఛాతీపై గాయాలు, పగిలిన పక్కటెముకలు, ఎడమ మోకాలికి దెబ్బ, పై చేయి విరిగిపోవడం వల్ల అతనికి కదలిక తగ్గిందని దాంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది. దిగువ కోర్టు శారీరక హాని, మానసిక క్షోభకు BD8,500, అతని చిన్న కొడుకుకు కలిగిన బాధకు BD400 చెల్లించాలని ఆదేశించింది. వైద్య ప్యానెల్కు BD90 , చట్టపరమైన రుసుములలో BD100 అదనంగా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.
తాజా వార్తలు
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం







