రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి BD9,400 పరిహారం: కోర్టు
- July 05, 2025
మనామా: బహ్రెయిన్ రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొన్న తర్వాత అతనికి BD9,400 పరిహారం పెంచుతూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ వ్యక్తి రిఫాలో రోడ్డుపైకి అడుగు పెడుతుండగా, డ్రైవర్ అతన్ని గుర్తించలేక ఢీకొన్నాడు. ఇందులో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతని శాశ్వత వైకల్యాన్ని 15 శాతంగా లెక్కగట్టారు.
అప్పీల్స్ కోర్టు గతంలో BD8,900 మొత్తాన్ని బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది.దీనిపై డ్రైవర్ కారును కవర్ చేసిన బీమా సంస్థ మొదటి తీర్పును సవాలు చేసింది. అయితే, ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను పరిశీలించిన కోర్టు..నుదిటిలో విరిగిన ఎముక, తలపై గాయం, ఛాతీపై గాయాలు, పగిలిన పక్కటెముకలు, ఎడమ మోకాలికి దెబ్బ, పై చేయి విరిగిపోవడం వల్ల అతనికి కదలిక తగ్గిందని దాంతో అతడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కోర్టు నిర్ధారించింది. దిగువ కోర్టు శారీరక హాని, మానసిక క్షోభకు BD8,500, అతని చిన్న కొడుకుకు కలిగిన బాధకు BD400 చెల్లించాలని ఆదేశించింది. వైద్య ప్యానెల్కు BD90 , చట్టపరమైన రుసుములలో BD100 అదనంగా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









