హైదరాబాద్ ని ముంచెత్తిన భారీ వర్షం
- July 05, 2025
హైదరాబాద్: శనివారం సాయంత్రం భాగ్యనగరాన్ని ఆకస్మికంగా కుండపోత వర్షం చుట్టుముట్టింది.కొద్ది నిమిషాల్లోనే ఆకాశం మేఘాలతో కమ్ముకుని మబ్బులు వచ్చాయి. వర్షం కురవడం ప్రారంభమైన కొద్ది సేపటికే నగరం మొత్తం జలకళతో నిండిపోయింది.కోఠి, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, ఖైరతాబాద్, ట్యాంక్బండ్, సుల్తాన్బజార్, నారాయణగూడ, లక్డీకాపుల్, హిమాయత్నగర్ ప్రాంతాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. రహదారులన్నీ చెరువులను తలపించేలా మారాయి. భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు మానానమాలేదు.వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల వాహనాలు నీటిలో ఇరుక్కుపోయాయి. పాదచారులు ఒక్క అడుగు ముందుకు వేయాలంటేనూ సాహసం చేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ కదలకపోవడంతో చాలా మంది ప్రజలు గంటల తరబడి చిక్కుకుపోయారు.
లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇళ్లలోకి నీరు ప్రవేశించి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై మురుగు నీరు కలిసిపోవడంతో వాసన, దుర్వాసనలతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కూడా కొన్నిచోట్ల అంతరించిపోయింది.
కార్యాలయాలు, షాపుల నుంచి ఇంటికి తిరిగే సమయంలో వర్షం మొదలవ్వడం నగరవాసులకు చికాకు కలిగించింది. వర్షం పూర్తిగా ఆగకపోవడంతో చాలా మంది ట్రాఫిక్లోనే వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణాలు మరింత ఆలస్యమయ్యాయి.ఇలాంటి వర్షాలు నగరంలో అసౌకర్యానికి కారణమవుతుంటే, శాశ్వత పరిష్కారాలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ బలహీనత మరోసారి బయటపడింది. అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







