ఆ సామాజికవర్గానికి శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం
- July 06, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.నాగరాలు లేదా నగరాలు సామాజికవర్గానికి బీసీ-డి కింద కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ప్రకటించారు.ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పత్రాలు జారీ అవుతున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సామాజికవర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని మంత్రి హామీ ఇచ్చారు.
జిల్లాల మధ్య వివక్షపై మండిపాటు
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో నాగరాలు సామాజికవర్గానికి బీసీ-డి పత్రాలు ఇస్తున్నారని, కానీ మిగతా జిల్లాల్లో అధికారులు పట్టించుకోవట్లేదని మంత్రి సవితకు వర్గ నాయకులు వివరించారు. ఈ పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోతున్నారని వాపోయారు. అయితే రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ఒకే విధంగా వ్యవహరించాలని, అధికారుల తీరుపై సమీక్ష చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
2008లోనే బీసీగా గుర్తింపు, ఇప్పటికీ సమస్యలు
2008లో నాగరాలు సామాజికవర్గాన్ని బీసీ-డి కింద చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఓ విడుదల చేసినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ ఈ వర్గానికి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. విశాఖపట్నం, విజయవాడ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఈ వర్గ జనాభా అధికంగా ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల వారు తమ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. తక్షణమే అన్ని జిల్లాల్లో పత్రాల జారీకి చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







