షార్జాలో రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్ విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్..!!
- July 07, 2025
షార్జా: షార్జా నివాసితులు అద్దె ఒప్పందాన్ని నమోదు చేసుకున్న తర్వాత విద్యుత్, నీరు లేదా గ్యాస్ సేవలను వెంటనే అందుతాయని, ఇకపై ప్రత్యేక దరఖాస్తులను దాఖలు చేయవలసిన అవసరం లేదని షార్జా విద్యుత్, నీరు, గ్యాస్ అథారిటీ (సేవా) తెలిపింది. ఈమేరకు షార్జా మునిసిపాలిటీల కొత్తగా ఉమ్మడి ప్రక్రియను తీసుకొచ్చినట్లు పేర్కొంది.
మున్సిపాలిటీ లీజును ధృవీకరించిన తర్వాత, అద్దెదారులకు మెసేజ్ అందుతుందన్నారు. డిపాజిట్ డబ్బు చెల్లించిన వెంటనే, ప్రత్యేక అభ్యర్థన అవసరం లేకుండా సేవా సేవలు యాక్టివేట్ అవుతాయని అన్నారు. రెండు సంస్థల మధ్య ఇంటిగ్రేటెడ్ ఇ-లింక్ వ్యవస్థ కారణంగా ఇది అమలు అవుతుందని సేవా కస్టమర్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అల్ అస్కర్ అన్నారు.
అయితే, గతంలో షార్జాలోని అద్దెదారులు మొదట మునిసిపాలిటీలో వారి అద్దె ఒప్పందాన్ని ధృవీకరించాలి.ఆపై సర్వీస్ యాక్టివేషన్ను అభ్యర్థించడానికి షార్జా విద్యుత్, నీరు, గ్యాస్ అథారిటీ (సేవా)ని సందర్శించాలి లేదా విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ధృవీకరించబడిన ఒప్పంద పత్రాలు, ఎమిరేట్స్ ID వంటి పత్రాలను సమర్పించడం, యుటిలిటీలను కనెక్ట్ చేయడానికి ముందు భద్రతా డిపాజిట్ చెల్లించడం వంటివి ఉన్నాయి. దీనికి చాలా రోజులు పడేదని తెలిపారు. ఈ చొరవ అద్దెదారులు, ఇంటి యజమానులకు సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుందని వివరించారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









