షార్జాలో రిజిస్ట్రేషన్ కాగానే ఆటోమేటిక్ విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్..!!
- July 07, 2025
షార్జా: షార్జా నివాసితులు అద్దె ఒప్పందాన్ని నమోదు చేసుకున్న తర్వాత విద్యుత్, నీరు లేదా గ్యాస్ సేవలను వెంటనే అందుతాయని, ఇకపై ప్రత్యేక దరఖాస్తులను దాఖలు చేయవలసిన అవసరం లేదని షార్జా విద్యుత్, నీరు, గ్యాస్ అథారిటీ (సేవా) తెలిపింది. ఈమేరకు షార్జా మునిసిపాలిటీల కొత్తగా ఉమ్మడి ప్రక్రియను తీసుకొచ్చినట్లు పేర్కొంది.
మున్సిపాలిటీ లీజును ధృవీకరించిన తర్వాత, అద్దెదారులకు మెసేజ్ అందుతుందన్నారు. డిపాజిట్ డబ్బు చెల్లించిన వెంటనే, ప్రత్యేక అభ్యర్థన అవసరం లేకుండా సేవా సేవలు యాక్టివేట్ అవుతాయని అన్నారు. రెండు సంస్థల మధ్య ఇంటిగ్రేటెడ్ ఇ-లింక్ వ్యవస్థ కారణంగా ఇది అమలు అవుతుందని సేవా కస్టమర్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ హుస్సేన్ అల్ అస్కర్ అన్నారు.
అయితే, గతంలో షార్జాలోని అద్దెదారులు మొదట మునిసిపాలిటీలో వారి అద్దె ఒప్పందాన్ని ధృవీకరించాలి.ఆపై సర్వీస్ యాక్టివేషన్ను అభ్యర్థించడానికి షార్జా విద్యుత్, నీరు, గ్యాస్ అథారిటీ (సేవా)ని సందర్శించాలి లేదా విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో ధృవీకరించబడిన ఒప్పంద పత్రాలు, ఎమిరేట్స్ ID వంటి పత్రాలను సమర్పించడం, యుటిలిటీలను కనెక్ట్ చేయడానికి ముందు భద్రతా డిపాజిట్ చెల్లించడం వంటివి ఉన్నాయి. దీనికి చాలా రోజులు పడేదని తెలిపారు. ఈ చొరవ అద్దెదారులు, ఇంటి యజమానులకు సమయాన్ని ఆదా చేయడంలో సహాయపడుతుందని వివరించారు.
తాజా వార్తలు
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!







