పెరుగుతో మటన్ బిర్యాని
- July 14, 2016
కావలసిన పదార్దములు :
మటన్ : అరకేజీ , బియ్యం : అర కేజీ , పెరుగు : ముప్పావు లీటర్ , నెయ్యి : కప్పు (వంద గ్రాములు ) , ఉల్లిపాయలు : రెండు ధనియాలపొడి టీ స్పూన్ , దాల్చినచేక్కపొడి : టీ స్పూన్ , మిరియాలపొడి : అర టీ స్పూన్ , లవంగాలు : పది , అల్లంవెల్లుల్లి : టేబుల్ స్పూన్ , ఉప్పు : సరిపడా , నీళ్ళు : కప్పు
తయారుచేయు విధానం :
మటన్ ముక్కలుగా కోసి కడిగి, ఉప్పు, అల్లంవెల్లుల్లి, పసుపు కలిపి గంట పక్కనపెట్టాలి. ఇప్పుడు అర లీటరు పెరుగు తీసుకోని దానిలో ధనియాలపొడి, యాలుకలపొడి, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి, కప్పు నీళ్ళువేసి బాగా కలిపి మటన్ లో వేసి అరగంట పక్కన ఉంచాలి. ఇప్పుడు పాన్ లో మటన్ మిశ్రమం వేసి సర్దాలి. నెయ్యి వేడి చేసి లవంగాలు వేపి, నేయ్యితో పాటే మటన్ మీద వెయ్యాలి. ఇప్పుడు బియ్యం కడిగి, మిగిలిన పెరుగు బియ్యంలో కలిపి, పాన్ లో వున్న మటన్ మీద వేసి సర్ది, మిగిలిన నెయ్యి కూడా వేసి మూత పెట్టి మీడియం మంట మిద ఉడకనివ్వాలి. ఆవిరి వస్తున్నప్పుడు సింలో పెట్టి పావు గంట ఉడకనిచ్చి దించాలి. నీళ్ళు లేకుండా పెరుగుతో మాత్రమే వండే మటన్ బిర్యాని రెడి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







