16 & 17 తారీకుల్లో 'సదరన్ ట్రావెల్స్' వారి హాలిడే బజార్
- July 14, 2016
చారిత్రక ప్రాంతాలతో పాటు దేశంలోని పుణ్యక్షేత్రాలకు ప్యాకేజీ టూర్లు నిర్వహించడంలో ఖ్యాతి గాంచిన సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్ పేరిట తెలంగాణలోని నాలుగు ప్రాంతాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో రాయితీతో ప్యాకేజీ టూర్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. గురువారం లక్డీకాపూల్లోని సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రావెల్స్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ ఏవీ ప్రవీణ్కుమార్ హాలిడే బజార్ విశేషాలను వెల్లడించారు. సదరన్ ట్రావెల్స్ కార్యాలయాలు లేని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా తమ ట్రావెల్స్ సేవలను అందుబాటులో ఉంచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ లక్డీకాపూల్లోని హోటల్ అశోకాలో, వరంగల్ హన్మకొండ బాలసముద్రం వద్ద ఉన్న హోటల్ హరిత కాకతీయలో, కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఎదురుగా ఉన్న హోటల్ ప్రతిమ రెసిడెన్సీలో, నిజామాబాద్ ఫులాంగ్ ఎక్స్రోడ్డు వద్ద ఉన్న హోటల్ వంశీ ఇంటర్నేషల్లో రెండురోజులు ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు హాలిడే బజార్ కొనసాగుతుందన్నారు. ఇందులో మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, శ్రీలంక, యూరప్, అమెరికాలతో పాటు చార్థామ్, కశ్మీర్, సిమ్లా, కులీమనాలి, జైపూర్, అలహాబాద్, వారణాసి తదితర టూర్లతో పాటు కొత్తగా ప్రవేశపెడుతున్న కోస్టల్ కర్ణాటక, గుజరాత్ టూర్ల ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ రెండురోజుల్లో బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. తమ ప్యాకేజీలు బుక్ చేసుకున్న వారికి ఏసీ బస్సులు, ఏసీ హోటల్ గదులతో పాటు అనుభవం ఉన్న గైడ్లతో టూర్లు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









