ఈ-కామర్స్ సంస్థలు ఆన్లైన్లో పుర్రెలు..
- July 14, 2016
ఆన్లైన్లో ఈ-కామర్స్ సంస్థలు సెల్ఫోన్లు, దుస్తులు, పాదరక్షలు, ఆహార పదార్థాలు వంటివి అమ్ముతాయని మనకు తెలుసు. కానీ పుర్రెలు కూడా అమ్ముతాయని తెలుసా. అవును ఇది నమ్మలేని నిజం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈబే అదే పని చేసింది. సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్లైన్లో వేలం పెట్టే ఈ సంస్థ పుర్రెలను వేలానికి పెట్టింది. పుర్రెల్లో ఇండియా, చైనాకు చెందినవే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 237 మంది 454 పుర్రెలను అమ్మకానికి ఉంచారు.అమ్మకానికి ఉంచిన వారిలో అమెరికాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. ఏడు నెలలుగా పుర్రెల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో అత్యధికంగా ఒక పుర్రె రూ. 3 లక్షలు పలకగా, ఇంకొక పుర్రె తక్కువగా రూ.50 వేలు పలికింది. ఇంతకు ఈ పుర్రెలను ఏం చేస్తారనుకుంటున్నారా..వీటిని వైద్య ప్రయోగాలకు ఉపయోగిస్తామంటున్నారు. కానీ ఈ పుర్రెలు పురావస్తు తవ్వకాల్లో దొరికినట్టుగా కొందరు అనుమానిస్తున్నారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈబే పుర్రెల అమ్మకాన్ని నిషేధించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









