స‌చిన్ కు అపూర్వ గౌర‌వం..

- July 10, 2025 , by Maagulf
స‌చిన్ కు అపూర్వ గౌర‌వం..

లండ‌న్: లార్డ్స్ మైదానంలో  ఉన్న ఎంసీసీ మ్యూజియంలో ఇవాళ లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ చిత్ర‌ప‌టాన్ని ఆవిష్క‌రించారు. ఇంగ్లండ్‌, ఇండియా మ‌ధ్య మూడో టెస్టు జ‌రుగుతున్న నేప‌థ్యంలో స‌చిన్ చిత్ర‌ప‌టాన్ని ప్ర‌ద‌ర్శించారు. స్టువ‌ర్ట్ పియ‌ర్స‌న్ రైట్ ఈ చిత్ర‌ప‌టాన్ని వేశారు. 18 ఏళ్ల క్రితం తీసుకున్న ఓ ఫోటో ఆధారంగా ఆయిల్ పేయింట్స్‌తో దీన్ని వేశారు. ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు మ్యూజియంలో స‌చిన్ చిత్ర‌ప‌టం ఉంటుంది. ఆ త‌ర్వాత దీన్ని పెవ‌లియ‌న్‌కు మార్చ‌నున్నారు. గ‌తంలో భార‌త మేటి క్రికెట‌ర్లు క‌పిల్‌దేవ్‌, బిష‌న్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్‌స‌ర్క‌ర్ల పోట్రేట్ల‌ను కూడా పియ‌ర్స‌న్ వేశాడు.

ఈ సంద‌ర్బంగా స‌చిన్ మాట్లాడుతూ, లార్డ్స్‌లో త‌న చిత్ర‌ప‌టాన్ని ఉంచ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. 1983లో క‌పిల్‌దేవ్ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన స‌మ‌యంలో.. తొలిసారి లార్డ్స్ స్టేడియాన్ని చూశాన‌ని, ఆ సంద‌ర్భం త‌న కండ్ల‌ల్లో ఉండిపోయింద‌ని, ఇప్పుడు త‌న చిత్ర‌ప‌టం లార్డ్స్‌లో ప్ర‌ద‌ర్శించ‌డం .. త‌న క్రికెట్ కెరీర్‌ను గుర్తుకు తెస్తున్న‌ట్లు సచిన్ తెలిపాడు. ఎంసీసీ క్ల‌బ్‌లో ప్ర‌స్తుతం మూడువేల ఫోటోలు ఉన్నాయి. దాంట్లో 300 వ‌ర‌కు పోట్రేట్లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com