మహిళా స్వయం సహాయక కేంద్రాలకు రూ.344 కోట్లు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క
- July 12, 2025
హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుభవార్త చెప్పింది.ప్రభుత్వం చెప్పిన మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల ను విడుదల చేసింది.ఈ మేరకు సెర్కు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. దీనిలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించింది.
ఈ నెల 18 వరకు ఖాతాల్లో వడ్డీ జమ
శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు సైతం ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వివరించారు. బిఆర్ఎస్ హయంలో వడ్డీలేని రుణాలు నిలిచిపోయాయని తెలిపారు.రూ.3000 కోట్లకు పైగా బిఆర్ఎస్ సర్కార్ బకాయిలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సకాలంలో వడ్డీలేని రుణాల చెల్లింపు జరుగుతోందని తెలిపారు. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







