మహిళా స్వయం సహాయక కేంద్రాలకు రూ.344 కోట్లు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్క
- July 12, 2025
హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శుభవార్త చెప్పింది.ప్రభుత్వం చెప్పిన మేరకు మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాల ను విడుదల చేసింది.ఈ మేరకు సెర్కు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. దీనిలో రూ.300 కోట్లు గ్రామీణ మహిళ సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు కేటాయించింది.
ఈ నెల 18 వరకు ఖాతాల్లో వడ్డీ జమ
శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో తెలిపారు. ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులు సైతం ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వివరించారు. బిఆర్ఎస్ హయంలో వడ్డీలేని రుణాలు నిలిచిపోయాయని తెలిపారు.రూ.3000 కోట్లకు పైగా బిఆర్ఎస్ సర్కార్ బకాయిలు పెట్టిందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సకాలంలో వడ్డీలేని రుణాల చెల్లింపు జరుగుతోందని తెలిపారు. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాల్లో అనూహ్య వృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!