కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం
- July 13, 2025
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. నటన అంటే ఏ విధంగా ఉండాలో 40ఏళ్ల పాటు నటించి చూపించారు. కోటతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజా సేవ చేశారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







