కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీఎం
- July 13, 2025
హైదరాబాద్: ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసంలో ఉంచిన భౌతికకాయాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోట శ్రీనివాసరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు మృతి బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. నటన అంటే ఏ విధంగా ఉండాలో 40ఏళ్ల పాటు నటించి చూపించారు. కోటతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజా సేవ చేశారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







