దుబాయ్లో ఆర్టిఫిషియల్ రిఫ్స్.. సముద్ర జీవుల పునరుద్ధరణ..!!
- July 13, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవులు పునరుద్ధరణకు, స్థానిక పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి దుబాయ్ పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ రిఫ్స్ నిర్మాణాల వైపు మొగ్గు చూపుతోంది. దుబాయ్లో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును నిశితంగా పరీక్షిస్తున్నారు. 2021, 2023 మధ్య రెండేళ్ల అధ్యయనంలో యూఏఈ జలాల్లో 40 రీఫ్ మాడ్యూల్లను ఏర్పాటు చేశారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా వచ్చాయని అన్నారు. బార్నాకిల్స్, బివాల్వ్లు, స్పాంజ్లతో సహా 17 జాతుల సముద్రజీవులలో పెరుగుదల ఆశించినస్థాయిలో నమోదైంది.
“సముద్ర జీవవైవిధ్యం 10%, చేపల బయోమాస్లో ఎనిమిది రెట్లు పెరుగుదలకు ముందస్తు సూచికలను కూడా ఈ అధ్యయనం చూపించింది. చివరికి ఇది స్థానిక సముద్ర జీవవైవిధ్యాన్ని పెంచుతుంది. ” అని దుబాయ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అథారిటీ (DECCA) డైరెక్టర్ జనరల్ అహ్మద్ మొహమ్మద్ బిన్ థాని అన్నారు. రీఫ్ మాడ్యూళ్ల ఉత్పత్తి ఆగస్టు 2024 లో ప్రారంభమైంది.
దుబాయ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ అథారిటీ ప్రకారం.. ప్రతి మాడ్యూల్ 100 సంవత్సరాలకు పైగా ఉండేలా రూపొందించారు. ఇది సముద్ర జీవులు వృద్ధి చెందడానికి దీర్ఘకాలికంగా స్థిరత్వాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ 2024 లో ప్రారంభించిన దుబాయ్ రీఫ్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రీఫ్ ప్రాజెక్టులలో ఒకటిగా మారుతుంది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







