ఒమన్ ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన యూఏఈ పౌరులు..!!
- July 15, 2025
యూఏఈః ఒమన్లో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఎమిరాటీలను గుర్తించారు. ఫుజైరాలో పోలీసు అధికారి రషీద్ గరీబ్ అల్ యమహి, అతని భార్య జవహెర్ మొహమ్మద్ అల్ యమహి, అతని అత్త ఖాదీజా అలీ అల్ యమహి గా గుర్తించారు. 25 ఏళ్ల రషీద్ ఫుజైరా పోలీసులలో కరెక్షనల్, శిక్షాత్మక సంస్థలో ఫస్ట్ కార్పోరల్గా పనిస్తున్నారు. అతని భార్య జవహర్ వయసు 21, ఆమె తల్లి ఖదీజా వయసు 51 అని అధికారులు తెలిపారు. కాగా, వారి ఎనిమిది నెలల కుమార్తె ఒమన్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇతర కుటుంబ సభ్యులు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఫుజైరాలోని షేక్ ఖలీఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిలో అలీ అల్ యమహి, అతని భార్య షైఖా అల్ సరీది, వారి పిల్లలు దలాల్ (4), మొహమ్మద్ (7), ఖదీజా (1), అలాగే అలీ తోబుట్టువులు సబిహా (15), హమద్ (18) ఉన్నారు.
ఒమన్లోని ధోఫర్లోని సుల్తాన్ సయీద్ బిన్ తైమూర్ రోడ్లో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వేసవి సెలవుల కోసం కుటుంబం సలాలాకు వెళుతుండగా.. ఈ విషాదకర ప్రమాదం జరిగింది. ఒమన్ నుండి వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకువచ్చిన తర్వాత శనివారం ఫుజైరాలో ముగ్గురికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఒమన్ పోలీసుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదంలో మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఇద్దరు ఒమానీలు, ముగ్గురు ఎమిరాటీలు సహా ఐదుగురు మరణించారు. మరో పదకొండు మంది గాయపడ్డారు. వారిలో తొమ్మిది మంది ఎమిరాటీలు ఉండగా, ఐదుగురు పిల్లలు ఉన్నారు. గాయపడ్డ ఎమిరాటీలను మెరుగైన వైద్యం కోసం ఒమన్ ప్రత్యేక విమానంలో యూఏఈకి తరలించారు.ఈ సందర్భంగా యూఏఈ పౌరులు రోడ్డు మార్గంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ చట్టాలు, వేగ పరిమితులను పాటించాలని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







