దుబాయ్‌లో వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్‌.. Dh100,000 కోల్పోయిన ఇండియన్..!!

- July 15, 2025 , by Maagulf
దుబాయ్‌లో వాట్సాప్ ట్రేడింగ్ స్కామ్‌.. Dh100,000 కోల్పోయిన ఇండియన్..!!

యూఏఈ: దుబాయ్‌లోని భారతీయ బ్యాంక్ కన్సల్టెంట్ సతీష్ గద్దే (పేరు మార్చాము), ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో Dh100,000 కోల్పోయాడు.  అతను పర్సనల్ లోన్ ద్వారా తీసుకున్న డబ్బును స్కామ్ లో లాస్ అయ్యాడు. ఇప్పుడు Dh8,000 నెలవారీ వాయిదాలను కడుతున్నాడు. ఇది అతని జీతంలో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఈ మొత్తం స్కామ్ వాట్సాప్ చాట్‌ల ద్వారా బయటపడింది.

పోలీసుల కథనం ప్రకారం.. గద్దేను ఒక గ్రూపులో చేర్చారు. అతన్ని మోసం చేసిన వ్యక్తులతో ఎప్పుడూ మాట్లాడలేదు లేదా కలవలేదు. "వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను దానితో ముందుకు సాగానని నేను నమ్మలేకపోతున్నాను" అని అతను అన్నారు. "నాకు ఏమీ తెలియని వ్యక్తులను నేను విశ్వసించాను.  వారు ఎలా మాట్లాడారో కూడా కాదు. అదే నన్ను బాగా బాధపెడుతున్నది." అని వాపోయాడు.   

ఇదంతా ఏప్రిల్‌లో ప్రారంభమైంది.  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గద్దె నెలకు Dh14,000 సంపాదిస్తున్నాడు.  స్టాక్ మార్కెట్ స్ట్రాటజీ C4 అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చారు. ఆ గ్రూప్‌లో 137 మంది సభ్యులు ఉన్నారు.  భారతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించే అడ్మిన్‌లు దీనిని నిర్వహిస్తున్నారు. “మొదట, నేను అందులో వచ్చే మెసేజులను పట్టించుకోలేదు. కానీ తర్వాత సభ్యులు భారీ లాభాల స్క్రీన్‌షాట్‌లు , డిపాజిట్ స్లిప్‌లను పోస్ట్ చేయడం నన్ను ఆకర్షించింది.” అని తన అనుభవాన్ని పంచుకున్నారు.

అయితే, ఇక్కడ నిజమేమిటంటే.. ఆ గ్రూప్ స్కామర్లు నమ్మకాన్ని పెంపొందించడానికి విజయవంతమైన పెట్టుబడిదారులుగా నటించారు.  వారే కస్టమర్లుగా నటిస్తూ, డబ్బు సంపాదించడంలో సహాయం చేసినందుకు అడ్మిన్‌కు నిరంతరం కృతజ్ఞతలు తెలిపేవారు. అవతలి వారిని బాగా నమ్మేలా మ్యానిఫులేషన్ చేసేవారు.  ఈ క్రమంలో అతనికి వ్యక్తిగతంగా గైడ్ చేయడానికి అడ్మిన్‌లలో ఒకరి నుండి ప్రైవేట్ మెసేజ్ వచ్చింది. తరువాతి కొన్ని రోజుల్లో, గడ్డేను ArmorCapital.net అనే ప్లాట్‌ఫామ్‌లో ట్రేడింగ్ ఖాతా తెరవమని ప్రోత్సహించారు. అడ్మిన్ సూచనలను అనుసరించి, అతను యూఏఈ బ్యాంక్ ఖాతాకు రెండు విడతలుగా Dh65,000 బదిలీ చేశాడు. అతను తన భారతీయ ఖాతాల నుండి స్కామర్లు అందించిన మరొక బ్యాంక్ ఖాతాకు Rs800,000 (సుమారు Dh35,000) బదిలీ చేశాడు. ఈ సందర్భంగా భారతదేశం నుండి కంపెనీ రిజిస్ట్రేషన్, US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ నుండి వచ్చినట్లు చెప్పుకునే సర్టిఫికేట్ కూడా పంపడంతో మొదట్లో ఎలాంటి సందేహాలు రాకుండానే పెట్టుబడి పెట్టాడు.  

ఇక నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో గడ్డే ఖాతాలో లాభాలను చూపించడం ప్రారంభించారు. రియల్-టైమ్ చార్ట్‌లు, గ్రాఫ్‌లు కూడా రావడంతో అతడికి ఇదంతా నిజమే అనిపించింది.  ఖాతా మేనేజర్ పేరిట పరిచయం అయిన వ్యక్తి తన తరపున IPO కొనుగోలు చేసినట్లు అతనికి మెసేజ్ పంపారు. మరో 620,000 దిర్హామ్‌లను డిపాజిట్ చేయకపోతే, ఇప్పటివరకు జమ చేసిన మొత్తం పెట్టుబడి పోతుందని హెచ్చరించాడు.  దాంతో అతడికి అనుమానం వచ్చింది. కాల్ చేసేందుకు ప్రయత్నించగా, ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఒక వారం తర్వాత, వెబ్‌సైట్ కూడా మాయమైంది. ఈ క్రమంలో వాట్సాప్ గ్రూప్ లోని అనేక నంబర్లకు డయల్ చేయగా.. చాలా వరకు స్విచ్ ఆఫ్ అయ్యాయి. కొన్ని రింగ్ అయినా, వివరాలను అడిగే లోపే కాల్ కట్ అయ్యేదని బాధితులు వాపోయాడు.  అనంతరం వారు పంపిన సర్టిఫికేట్లు కూడా ఫేక్ అని తేలిందన్నారు.  

మోసపోయానని గ్రహించి గత నెలలో అల్ రిఫా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు అతను తెలిపారు. "ఇతరులు అలాంటివారి ఉచ్చులో పడకుండా ఉండటానికి పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నాడు. 

ఈ నెల ప్రారంభంలో యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ Xపై పబ్లిక్ అలర్ట్ జారీ చేసింది. పెట్టుబడి పెట్టే ముందు సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ (SCA) ద్వారా ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ల లైసెన్సింగ్ స్థితిని ధృవీకరించాలని నివాసితులను కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com